కేసీఆర్ గారూ..అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు రండి

– తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం

ఈనెల 28 నుండి, 10 అగస్టు వరకు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44 వ ఫైడ్ (FIDE) అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును తమిళనాడు సిఎం ఎం.కె.స్టాలిన్ ఆహ్వానించారు.

ఈమేరకు సిఎం స్టాలిన్ తన పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్ కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి 28 జూలై నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా సిఎ కెసిఆర్ ను తమిళనాడు సిఎం కోరారు.

ఈ సందర్భంగా డిఎంకె ఎంపీ గిరిజానన్., సిఎం కెసిఆర్ కు శాలువా కప్పి, జ్జాపికను అందచేసి ఆహ్వాన పత్రికను అందించారు. కాగా 188 దేశాలనుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు, భారత దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్నప్రతిష్టాత్మక పోటీలని లేఖలో సిఎం స్టాలిన్ పేర్కొన్నారు.

Leave a Reply