– కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం
– జనవరి 26 నుంచి రైతు భరోసా
– వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.12వేలు
– పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపాం. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాం.
జనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నాం. వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.12వేలు అందించబోతున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. మొదటి ఏడాదిలోనే 55143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాదిలో రూ.54వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. రూ .500 లకే సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించింది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.