మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే రకం జగన్ మోసపు రెడ్డి. జనం సొమ్ము దోపిడీకి ఆడని జగన్ నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వలంటీర్లుగా పెట్టుకుని పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం ధారపోస్తున్నారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం కాదు.. ప్రజాధనం ఏదో విధంగా కాజేయడమే అని కొత్తసూత్రంతో పాలన సాగిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. వాటి రీఛార్జిల ఖర్చు ప్రజల డబ్బే. వీరు పనిచేసేది వైసీపీ కోసం. మొబైల్ లో ఇంటర్నెట్ వాడి సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. కానీ జనం సొమ్ము సొంతానికి ఎలా వాడుకోవాలనే అత్యాశతో మరో JO తెచ్చారు. GO అంటే గవర్నమెంట్ ఆర్డర్..JO అంటే జగన్ ఆర్డర్. మూడేళ్ల పాలనలో సర్కారు ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం రూ.300 కోట్లు సాక్షికి ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలని హుకుం జారీతో మరికొన్ని కోట్లు గుంజేశారు. సచివాలయంలో సాక్షి పేపర్ పడుతుండగా, మొబైల్లో ఈ పేపర్ యాక్సెస్ వుండగా…మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి వేయించుకోవాలని నెలకి రూ.5.32 కోట్లు JO ఇచ్చేశారు. అంటే ఏడాదికి 63.84 కోట్లు. జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న జగన్ జనానికి ఎదురొచ్చినా…జనమే ఎదురెళ్లినా జనానికే రిస్కు. అవినీతి బకాసురుడు జగనాసురుడు ఆకలికి ఆంధ్రప్రదేశ్ ఆహారమైపోతోంది.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…