Suryaa.co.in

Andhra Pradesh

కొద్దిమంది వ్యక్తుల వల్ల జ్యుడీషియరీ పై నమ్మకం పోయే పరిస్థితి

– అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారు
– తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు
– మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జ్యుడీషియరీ కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి. నేను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చు.తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈకేసులో బెయిల్ కాదు.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలి. చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఉత్తమంలా మారాల్సిన అవసరం ఉంది.

మరికొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుంది. ఆరోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం. ఇలాంటి కేసులకు, ఈడీ కేసులకు కూడా మేము భయపడం. ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటాం.

చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అధికారులు గుర్తించాలి

LEAVE A RESPONSE