గుంటూరు: మిర్చి రైతుల మద్దతు ధర గురించి రైతులను కలవడానికి గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్న వైయస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అంబటి రాంబాబు పార్టీ శ్రేణులను కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జిలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులతో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉ. 10.30 గంటలకు పర్యటనకు జిల్లా ప్రజలు మద్దతుగా రావాలని కోరారు.