ఒక పండగలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

– మన ఇల్లే కాకుండా, వీధులు, గ్రామం శుభ్రంగా ఉండాలి
– వీటన్నింటి ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పూర్తి పరిశుభ్రత
జగనన్న స్వచ్ఛ సంకల్పం–క్లాప్‌:
గాంధీ జయంతి, లాల్‌ బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం. అర్బన్‌ ప్రాంతాల్లో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌–క్లాప్‌ కార్యక్రమం. ఇందులో భాగంగా రేపు (శనివారం) చెత్త సేకరణ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ ఆ వాహనాలను విజయవాడలో ప్రారంభిస్తారు.ఆ వాహనాలు అన్ని జిల్లాలకు చేరిన తర్వాత మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌ల ప్రతినిధులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ పక్షోత్సవాల స్ఫూర్తిగా:
గత ఏడాది కోవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో ఆగసు,్ట అక్టోబరులో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తే, అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇంటికి రూ.2 చొప్పున ఇవ్వాలని కోరితే బాగా స్పందించారు. దాంతో ఆగస్టులో రూ.4 కోట్లు. అక్టోబరులో రూ.3 కోట్లు వచ్చాయి. ఆ కార్యక్రమం బాగా విజయవంతమైంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని 100 రోజుల కార్యక్రమాన్ని రేపటి (శనివారం) నుంచి మొదలుపెడుతున్నాం.
గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
అవసరమైన వ్యవస్థ:
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి…
– ఇప్పటికే 10,645 సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్లు కట్టాం. వాటిలో కొన్నింటి పనులు మిగిలిపోగా, ఇప్పుడు వాటిని పూర్తి చేయడంతో పాటు, కావాల్సిన విధంగా మార్పులు చేస్తున్నాం. రాష్ట్రంలో 13,371 పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఇంకా 4,175 సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా నిర్మాణం చేస్తున్నాం.
రాష్ట్రంలో 27 వేల మంది గ్రీన్‌ అంబాసిడర్లు ఉన్నారు. వారి సేవలు కూడా వినియోగిస్తూ, వారికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా జీతాలు ఇస్తున్నాం. మరో 10 వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
14 వేల ట్రై సైకిళ్లు, 1000 ఆటోలు ఇస్తున్నాం. 10 వేల జనాభా ఉన్న గ్రామాలతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పొరుగున ఉన్న గ్రామ పంచాయతీలకు ఆటోలు ఇస్తున్నాం.
ఇంకా 6,417 ఇన్సినరేటర్‌ పరికరాలు పంపిణీ చేయబోతున్నాం. వాటి ద్వారా శానిటరీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ. మొత్తం వీటన్నింటి ద్వారా కంపోస్ట్‌ ఎరువు తయారీ చేస్తూ, ఆ విధంగా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. దీంతో పాటు, కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్ల కేటాయింపుతో పాటు, దోమల నివారణకు 10,628 పోర్టబుల్‌ థర్మల్‌ ఫాగింగ్‌ యంత్రాలు పంపిణీ చేయబోతున్నాం.వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు ఈనెల 30 వరకు ఎస్‌ఐఆర్‌డి కింద శిక్షణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం.
పచ్చదనం–పరిశుభ్రం:
తొలి విడతగా 5 వేలకు పైగా జనాభా ఉన్న ట్రైలర్‌తో కూడుకున్న ట్రాక్టర్లు. రెండో విడత కింద 2 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు ట్రైలర్‌తో కూడిన ట్రాక్టర్లు ఇవ్వబోతున్నాం. జగనన్న పచ్చ తోరణం కింద మొక్కలు నాటడం. స్కూళ్లలో కూడా మొక్కలు నాటడానికి ఈ ట్రాక్టర్లు వినియోగం జరుగుతుంది. అంతే కాకుండా చెత్తను సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు తరలించడం కూడా సక్రమంగా జరుగుతుంది.
అందరి భాగస్వామ్యం:
గ్రామాల్లో సీసీ రోడ్లు. సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు జరిగాయి. అవన్నీ పరిశుభ్రంగా ఉండడంలో ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది కాబట్టి, ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అలాగే కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

Leave a Reply