– అయినవోలు రచ్చబండ సభలో మంత్రి నాదెండ్ల పిలుపు
– అపోహలొద్దు.. 29 గ్రామాలను అభివృద్ధి చేస్తాం –
– 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన –
అయినవోలు: ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా 34000 ఎకరాలను 50 రోజుల్లోపు నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి అందించారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు..గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐయినవోలు గ్రామం రామాలయం సెంటర్ వద్ద రచ్చబండ కార్యక్రమం జరిగింది.
రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈనెల రెండవ తేదీ అమరావతిలో జరుగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, చైతన్యం కలిగిన ప్రజలు…. ప్రధాని సభను విజయవంతం చేయాలన్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలను అభివృద్ధికి భరోసా ఇచ్చారు.. ఒక నగరం అభివృద్ధి జరగాలంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ రావాలన్నారు …. మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, టిడిపి జనసేన బిజెపి నాయకులు, ఎర్రబాలెం, బేతపూడి, అయినవోలు గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.