– రేవంత్ గొప్ప ఇందులో ఏమీ లేదు
– రెసిడెన్షియల్ స్కూళ్ల ను ఏమి చేస్తారు ?
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ,ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి,కార్పొరేటర్ హేమ
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులు ఎంబిబీఎస్ ,ఐఐటీ ,ఐ ఐ ఎం లలో మంచి ర్యాంకులు సాధించారు .వారికి బీ ఆర్ ఎస్ తరపున అభినందనలు. పదేళ్ల కేసీఆర్ పాలన లో 6052 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో ఐఐటీ ,ఎం బి బీ ఎస్ ,ఐఐఎం లలో ర్యాంకులు సాధించారు.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కార్యక్రమం లో కేసీఆర్ అసలు గురుకులాల గురించి ఏమీ చేయలేదని అబద్దాలు మాట్లాడారు. కేసీఆర్ గురుకులాల ద్వారా విజయాలు సాధించిన విద్యార్థులే నిన్న రేవంత్ కార్యక్రమం లో ఉన్నారు. కేసీఆర్ హయం లో ఓ క్రమ పద్దతిలో చేసిన ప్రయత్నాల వల్లే గురుకులాలు మంచి ఫలితాలు సాధించాయి.
ఎన్నో కొత్త గురుకుల కళాశాలలు కేసీఆర్ హయం లో వచ్చాయి. ప్రత్యేక శ్రద్ద తో గురుకులాలు నడపడం వాళ్లే ఈ ఫలితాలు వచ్చాయి. రేవంత్ గొప్ప ఇందులో ఏమీ లేదు. రేవంత్ రెడ్డి తమ ఇంటి గ్రేటెడ్ రెసిడెన్టియల్ స్కూళ్ల ను ఓ పార్టీ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. బీ ఆర్ ఎస్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏనాడు వ్యతిరేకించలేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పై రేవంత్ వి మాటలే తప్ప చేతలు లేవు. అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పై ప్రభుత్వానికే స్పష్టత లేదు.
కేవలం బిల్డింగ్ లు కడితే సరిపోతుందా ? ఎదుటి వాళ్ళ మీద సీఎం నిందలు వేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనా వ్యయాన్ని 80 కోట్ల నుంచి 200 కోట్లకు ఎందుకు పెంచారు? ఏదో వేరే రాష్ట్రం ఏజెన్సీ కి వాటిని అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. ఇంకా బిల్డింగ్ లే పూర్తి కాలేదు ..అపుడే ఆర్భాటపు ప్రకటనలు చేస్తారు. ఇపుడు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ల ను ఏమి చేస్తారు ?
ఎంత మంది విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో అవకాశం ఇస్తారు ?ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రేవంత్ మూసేసే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసి వేత పై అసెంబ్లీ లో ప్రశ్న అడిగితే సమాధానం లేదు. 2 వేల ప్రభుత్వ స్కూళ్ల ను మూసేశారు. గురుకులాల్లో పరిస్థితులను దారుణం గా మార్చేశారు. మన ఊరు మనబడి ఈ ప్రభుత్వానికి ఎందుకు నచ్చలేదో చెప్పాలి.
కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడం తప్ప రేవంత్ కు ఏదీ చేతకావడం లేదు. విద్యా కమిషన్ వేసి ఏడాది అవుతుంది .ఏ ఘనత సాధించారో చెప్పాలి. ఉద్యోగాల భర్తీపై రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. రేవంత్ ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు కేసీఆర్ హయం లో ఇచ్చిన నోటిఫికేషన్ల ఫలితమే.
కేసీఆర్ కుల వృత్తులకు ఆదరణ కల్పించారు .దాన్ని కూడా రేవంత్ తప్పుపట్టడం దారుణం. కుల వృత్తులను కేసీఆర్ కాపాడారు .2 లక్షల ఉద్యోగాల భర్తీ చేశారు .అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కేసీఆర్ ను తిట్టడమే సమస్యలకు పరిష్కారమా ? విద్యా వ్యవస్థ కేసీఆర్ హయం లో మెరుగుపడింది.
గురుకులాల్లో నాణ్యత గల విద్య లభిస్తోందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం లో వెల్లడైంది. విద్యార్థులతో టాయిలెట్లు కడిగిస్తే తప్పేమిటని సంక్షేమ గురుకుల ఉన్నత అధికారి మాట్లాడటం ఎంత వరకు సమంజసం ? ప్రభుత్వం వసతులు కల్పించకుండా విద్యార్థులతో పనులు చేపిస్తుందా? వారి చదువులపై ఇలాంటి పనులు ప్రభావం చూపవా ? గురుకులాల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు తగ్గిస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి కేటాయించింది 2 వేల కోట్ల ను కూడా విడుదల చేయలేదు. కేసీఆర్ హయం లో ప్రభుత్వ మూతపడ్డాయని ప్రచారం చేశారు. వాటిలో ఎన్ని తెరిపించారో సీఎం చెప్పాలి. విద్యా శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డే ఉన్నారు. అయినా విద్యా శాఖ లో గతం లో కన్నా అదనంగా చేసిన పనేమీ లేదు.
మంచి పనుల్లో కేసీఆర్ తో పోటీపడండి. కేసీఆర్ పై వేలెత్తి చూపడం లో కాదు. మన ఊరు మనబడి కింద చేసిన పనులకు నిధులు కేటాయించండి. ఓవర్సీస్ స్కాలర్ షిప్ లను విడుదల చేయండి. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నా. ప్రతీ దానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తున్నామని గొప్పలు. చెప్పుకోవడం కాదు. వాటిపై స్పష్టత నివ్వండి.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై క్లారిటీ ఇవ్వాలి: ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి
విద్యా వ్యవస్థకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంచనాలు చూస్తే భయం అవుతుంది. స్కూల్స్ లో వసతులు,టీచర్ల రిక్రూట్మెంట్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మండల, జిల్లా పరిషత్ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. విద్యా వ్యవస్థ పై సమీక్షలు లేవు. నియోజకవర్గానికి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ సరిపోతుందా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి