ఆక్రా: కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచాన్ని కొత్త వైరస్లు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన ‘మర్బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూడటం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మృతుల నమూనాలు సేకరించి సెనెగల్లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా మర్బర్గ్ వైరస్గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది.