మాదిగ సామాజిక వర్గం వారు గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపు
– మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) సమావేశం, వెబ్ సైట్ ఆవిష్కరణ

మాదిగ సామాజిక వర్గం వారు గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, తద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బేగంపేటలోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరిగిన మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( మిక్కీ ) మొదటి వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ప్రస్తుత కాలంలో ప్రతిభ ముఖ్యమని, టాలెంట్ ఎదుట కులాలు మతాలు ఏవీ పని చేయవని అన్నారు.గతంలో
vinod2 ఉన్న సామాజిక అసమానతలు ఇప్పుడు లేవని ఆయన అన్నారు. గ్రీన్ పార్క్ హోటల్ కు చారిత్రక నేపథ్యం ఉందని, దాదాపు 20 సంవత్సరాల క్రితం ఉద్యమ నేత, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దళిత పాలసీ సమావేశం గ్రీన్ పార్క్ హోటల్ నిర్వహించామని, నాటి సమావేశం స్ఫూర్తితోనే దళిత బంధు స్కీం అమలు జరుగుతోందని, అదే హోటల్లో మిక్కీ సమావేశం జరగడం విశేషమన్నారు.

మాదిగ పారిశ్రామికవేత్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. మిక్కీ సభ్యుల అభ్యున్నతి కోసం తన వంతు సహకారాన్ని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మిక్కీ వెబ్ సైట్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పగిడిపాటి దేవయ్య, మిక్కీ అధ్యక్షులు సుంచు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క నరసింహ, సలహాదారులు ఆరేపల్లి రాజేందర్, వంశీ తిలక్, గంధం రాములు, కొమ్ముల నరేందర్, జయరాజ్ తెన్నేటి, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply