Suryaa.co.in

Telangana

మంత్రి సీతక్క చొరవ.. కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్ల దస్త్రంపై సీఎం సంతకం

హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లను (CRT) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది. రెన్యువల్ కు సంబంధించిన ఫైలు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో.. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని CRT రెన్యువల్ పై అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి సీతక్క భేటీ అయ్యి చర్చించారు. CRT రెన్యువల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో CRT రెన్యువల్ ఫైల్ పై వెనువెంటనే సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో మూడు వేల మంది కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లను రెన్యువల్ చేసినందుకు మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE