Suryaa.co.in

Telangana

ఆర్కే బీచ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం

– మృతుల కుటుంబాలకు మంత్రి తలసాని పరామర్శ

RK బీచ్ లో గల్లంతై మృతి చెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. విహార యాత్ర కోసం స్నేహితులతో కలిసి విశాఖపట్నం వెళ్ళి అక్కడి RK బీచ్ లో రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకులు మృతి చెందారు.

ఈరోజు మృతదేహాలను వారి నివాసాలకు తీసుకు రాగా, మంత్రి శ్రీనివాస్ యాదవ్ రసూల్ పురా లోని సిల్వర్ కాంపౌండ్ 2BHK కాలనీలో గల వారి ఇండ్ల వద్దకు వెళ్ళి మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మూడు

కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతులు ముగ్గురు అతి చిన్న వయసు కలిగిన వారని, నిరుపేద కుటుంబాలకు చెందిన వారని పేర్కొన్నారు. ఈ సంఘటన చాలా బాధాకరం అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందించి ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట కంటోన్మెంట్ MLA సాయన్న, మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.

LEAVE A RESPONSE