Suryaa.co.in

Telangana

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సాయంత్రం సితాఫలమండీ లో త్రీ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ కృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు శ్రీ కృష్ణుని మార్గాన్ని అవలంభించాలని, భగవత్గీతా సారాన్ని పాటించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిర్వాహక సంఘం అధ్యక్షులు బొగ్గుల కృష్ణ, నేతలు సాయి నాద్, జీ.వీ.కృష్ణ, అశ్విన్ కుమార్, చెన్నయ్య, వై.వీ.బాలాజీ, మురళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE