Suryaa.co.in

Telangana

నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై పలువురు ఎమ్మెల్యేలతో కల్వకుంట్ల కవిత సమావేశం

-బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదన చారి నేతృత్వంలో విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గ పెద్దలలో మర్యాద పూర్వక భేటీ
-బోధన్ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సమావేశం
-సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీ కవిత సమావేశం
-మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు షకీల్, గణేష్ తో సమీక్ష
-మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పి చైర్మన్ పుట్ట మధు
-నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కవిత కృషి

హైదరాబాద్: ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం రోజున ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదన చారి నేతృత్వంలో విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పెద్దలతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు.

బోధన్ నియోజకవర్గంలోని మండలంలో పలు అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలపై కవితతో ఎమ్మెల్యే షకీల్ చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధి పై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలపై మంతనాలు జరిపారు.

సింగరేణి ప్రాంత నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ ‌కవిత మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి.

నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కవితని కలిసి వినతి పత్రం అందించారు. వారి వినతుల పట్ల కవిత సానుకూలంగా స్పందించారు.

LEAVE A RESPONSE