అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్ నుండి ఎమ్మెల్సీimage-4 కవిత, బంగారు బోనం ఎత్తుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులతో కలిసి మహంకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదయ్య నగర్ కమాన్ నుండి మహంకాళి అమ్మవారి ఆలయం వరకు వందలాది మంది మహిళలు బోనాలతో వెంట రాగా, పోతురాజుల ఆటలు, కోలాటం బృందాల, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్ళతో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత వెంట సాగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతిimage-3 సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply