Suryaa.co.in

Telangana

తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు

-బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలి
-కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్ లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించే బాధ్యత నాది
-కుత్భుల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి

2018 ఎన్నికల్లో కేసీఆర్ కక్ష కట్టి కొడంగల్ లో నన్ను ఓడించాడు. కేవలం 20 రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్ గిరి ఎన్నికల్లో గెలిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా జనం మధ్య ఉండి కేసీఆర్ ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పైన కొ ట్లాడాను. డబ్బా ఇళ్లు వద్దు డబుల్ బెడ్రూం ముద్దన్న కేసీఆర్ ఒక్క ఇళ్లైనా ఇచ్చాడా?

మోసం చేసినందుకు జనం కేసీఆర్ ని బండకేసి కొట్టారు. పదేళ్లు తెలంగాణ ను దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్ లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించే బాధ్యత నాది. ప్రతి యేడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తీసుకువచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న మోదీ నయా పైసా కూడా ఇవ్వలేదు.

రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చి అదానీ,అంబానీలకు కట్టబెట్టాలని మోదీ చూస్తే రైతులు పోరాటం చేశారు. మోదీ 700 మంది రైతులను పొట్టు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ ను రద్దు చేసింది మోదీ. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే. గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలి. డిసెంబర్ లో కేసీఆర్ బై బై చెప్పారు.. ఇప్పుడు మోదీ కి బై బై చెప్పాలి. మల్కాజ్ గిరిలో సునీతా మహేందర్ రెడ్డి కి లక్ష ఓట్ల మెజారిటీ పక్కా..

LEAVE A RESPONSE