కమలానికి చంద్రుడు ఎంతో దూరం..

– మోదీ..జగన్ విషయంలో కాగితం పులి
– ఆంధ్రా సర్వనాశనం అయ్యేవరకు జగన్ ని ఉంచుతారు
– అమరావతిపై బీజేపీవి ఉత్తుత్తి అరుపులే

కమలానికి చంద్రబాబే కాదు ప్రతి తెలుగు వాడు దూరమే! రాష్ట్ర విభజన ముందూ ..ఆ తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే అర్దం అవుతుంది. ఈ కమలం వాజ్ పాయ్ ..అద్వానీల వల్ల వికసించినది కాదు. ఇప్పుడు వికసిస్తున్నాననుకుని కృశిస్తున్న …పుట్టిన బురదలో కూరుకుపోతున్న కమలం..!

వారికి వారి స్వంతపార్టీ లోని తెలుగువారంటే…అందులోనూ ఆంధ్రావాళ్ళంటే ఎంతో చులకన…చిరాకు..అసహనం..అసహ్యం. దాన్ని గమనించిన కొందరు కట్టుదాటి ..తెలుగు వాడినని మరచి…కట్టు బానిసల్లా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రులు ..బీజేపి ని…మోదీ ని నమ్మారు. ఆయన మనసులోని మర్మం ఎవరికీ తెలియలేదు.. ఇప్పటికీ తెలియదు. వైసీపీ భుజంమీద తుపాకి పెట్టి టీడీపి ని కూల్చారు. బీజేపి తో వైరం వల్ల టీడీపి నష్టపోయిందని చాలా మంది భావన. మోదీ అప్రతిహత విజయం…వైసీపి ఘనవిజయం వల్ల వారికి అలా అనిపించి ఉండవచ్చు.

కానీ బీజేపి ఆంధ్రాని అన్ని విధాలా తొక్కిపెట్టినా…మిత్రత్వం కొనసాగుతున్నా..సోము..జీవీయల్ లాంటి వారి నోటి తీట ..అడుగడుగునా ఆటంకాలు కల్పించినా..వారితో మిత్రత్వం కొనసాగించి ఉంటే ఇంకా ఘోరపరాజయం చవిచూసి ఉండేవారు.

అమరావతి…అభివృద్ది..కియాలాంటి కంపెనీలు…ఇలా వదిలేస్తే…ఆంధ్రా ప్రపంచం దృష్డిని ఆకర్షిస్తుంది…దరిమలా దేశప్రముఖుడి ప్రతిష్ట మసకబారుతుంది…జాతీయంగా అంతర్జాతీయంగా చంద్రబాబు కనిపిస్తాడు..!

అసలే కడుపు మంట…చంద్రబాబు మీద ద్వేషం తో రగిలి పోయే కేంద్రపెద్దలకు అది సుతారాము ఇష్టం ఉండదు. చంద్రబాబు ని ఘోరంగా ఓడించారు…కసితీరా అవమానిస్తుంటే చోద్యం చూసారు..!
చంద్రబాబు మీద కోపం కొంచెం తగ్గి ఉండవచ్చు..!
ఆయన అవసరం రావచ్చు!
కాని వారి రెండవ టార్గెట్ ఆంధ్రప్రదేశ్!
సహజ వనరులు…వాటి దోపిడీ యధేఛ్చ గా జరగాలి!

పోలవరం పెండింగ్ పడాలి…అమరావతి ఎలా ఉన్నది అలా ఉండాలి…దాని కోసం రాజధాని మార్పు లాంటి ప్రయత్నాలను చూసి చూడనట్టు వ్యవహరించటం…తదనంతరం ఉపశమనం కలిగించటం!
వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలను తూతూ మంత్రంగా వ్యతిరేకించటం…ఇక్కడి స్దానిక నాయకులను సరి సమానంగా విభజించి..గరగాట ఆడించటం!
ఎన్నికల్లో ఓడినా జనాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ ని చాలా ఒడుపుగా దగ్గర చేర్చుకున్నారు. పవన్ కేడర్ని ఉరికించి కొట్టించి …చచ్చినట్టు తమ దగ్గర కొచ్చేలా చేసుకున్నారు.

జగన్ ప్రభుత్వం మీద అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వస్తున్న తరుణంలో చంద్రబాబు తో చేరితే అగ్ని కి ఆజ్యం తోడైనట్టే ! అందుకే ఆయన్ని యమలీల బేచ్ లో కలిపేసుకున్నారు.
తెలుగు నాట కొన్ని మీడియా సంస్దలతో అవగాహన కొచ్చారు. కరోనా విజృంభించిన వేళ…స్దానిక ఎన్నికల అక్రమాలకు తోడు..ఎన్నికల కమీషనర్ తొలగింపు దగ్గర నుండి..లాక్ డౌన్ ఉల్లంఘనలు కళ్ళప్పగించి చూశారు.

అప్పుల ఊబిలో కూరుకుపోవటానికి పూర్తిగా సహకరిస్తున్నారు.
కేసులు అటకెక్కించారు.
జగన్ మీద ఏ మాత్రం చర్యలు తీసుకున్నా.. తిరిగి ఆంధ్రా పుంజుకుంటుంది!
చంద్రబాబు లేచి నిలబడతాడు! అది వారికిష్టం లేదు! అందుకే సర్వనాశనం అయ్యేవరకు జగన్ బాబు ని ఉంచుతారు.
ఏదైనా వీధిలో బలిసిన ఊరకుక్క తిరుగుతుందంటే…ఆ వీధిలోకి బిచ్చగాడు కూడా రాడు. అంతకు మించిన అనకొండ ఇక్కడ రాజ్యం ఏలుతుంటే పొరపాటున కూడా ఎవరూ అడుగుపెట్టరు.
ఆ విషయం జగన్ బాబుకి, విజయసాయికి బాగా తెలుసు.
అందుకే అంత బరితెగింపు!
విచ్చలవిడి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు మీద కుక్కలా మొరిగే జీవీయల్ తోక ముడుచుకుని కూర్చుంటాడు.
మోదీ గారు…జగన్ విషయంలో కాగితం పులి..
కొయ్యగుర్రం…కదలదు.
ఎప్పటికీ కమలానికి చంద్రుడు దూరమే…

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

Leave a Reply