Suryaa.co.in

National

మోహన్ భగవత్‌తో మోదీ భేటీ

– ప్రజలను రక్షించడం రాజు విధి అని ఇటీవల భగవత్ వ్యాఖ్యలు
– ఉన్నత స్థాయి భేటీ వెంటనే భగవత్‌ను కలిసిన మోదీ

ఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడిపై మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే, మోహన్ భగవత్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పహల్గాం మారణహోమానికి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ భగవత్ గత వారం ఓ బహిరంగ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మేము బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నాము. మతం అడిగి మరీ ప్రజలను చంపారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము ఆగ్రహంతో ఉన్నాము అని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి పేరును నేరుగా ప్రస్తావించకుండా, ప్రజలను రక్షించడం రాజు విధి అని భగవత్ అన్నారు. మనం పొరుగువారిని ఎప్పుడూ అవమానించం, హాని చేయం. కానీ ఎవరైనా చెడు మార్గంలోకి వెళితే, మరో మార్గం ఏమిటి? ప్రజలను రక్షించడం రాజు కర్తవ్యం. రాజు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దుండగులకు బుద్ధి చెప్పడం కూడా విధిలో భాగమే” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఓ బహిరంగ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భగవత్‌తో మోదీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

LEAVE A RESPONSE