Suryaa.co.in

National

అటవీ అధికారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొజం అలీ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక

ఢిల్లీ : అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య జాతీయ సమావేశం నిన్న ఆదివారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.డీ. మోజామ్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ ( ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గజ్వేల్) దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆజం హుస్సేన్ (మెదక్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్) ఆలిండియా జాయింట్ సెక్రటరీగా, జాకీర్ ( డిప్యూటీ రేంజి ఆఫీసర్ మహబూబ్ నగర్) ఆలిండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికయ్యారు.

LEAVE A RESPONSE