Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ మారిన వారిపై వేటు సంగతేమిటి?

-మీరు చేస్తే రైటా?
-నేనేమీ పార్టీ మారలేదు
-పార్టీలో క్రమశిక్షణగల సైనికుడిని
-హవ్వ… నా పై అనర్హత వేటా ? ఎందుకు?
-రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉల్లంఘించలేదు
-ఇతర పార్టీ గుర్తులపై గెలిచి, పార్టీ కండువా వేసుకున్నా ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదు
-వైఎస్సార్ సిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ను తానేమి ఉల్లంఘించలేదని, అటువంటప్పుడు తనపై అనర్హత వేటనే ప్రశ్నే తలెత్తదని నరసాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పిన…కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఇంకా ఏ విధంగా ప్రభావితం చేయాలని చూసిన తనని ఏమి చేయలేరన్నారు. అసలు విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఏ క చిత్ర నటుడు మోర్గాని భరత్ రామ్ కు ఉందా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు .

మంగళవారం రచ్చబండ కార్యక్రమం లో భాగంగా మీడియా మాట్లాడుతూ…ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఐదు మంది ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని నిస్సిగ్గుగా తిరుగుతున్నా, వారిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఇతర పార్టీ గుర్తుల పై గెల్చిన ఐదు మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం ప్రజలకు తెలియదా అంటూ? రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. తానేమీ పార్టీ మారలేదని, పార్టీలోనే ఉంటూ ప్రశ్నిస్తే… తనపై అనర్హత వేటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

పార్లమెంట్లో తాను విప్ ఉల్లంఘించిన ట్లు తప్పుడు మాటలు చెబుతున్నారని… అసలు ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ నే జారీ చేయలేదని చెప్పారు. విప్ నే జారీ చేయనప్పుడు, దిక్కరించానన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 350 ఏ అధికరణం ఏమి చెబుతుందో తమ పార్టీ వారికి తెలియదన్నారు..అందుకే తాను తులనాడినట్లు గా మాట్లాడాలని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.. రాజ్యాంగంలోని 350 ఏ, అధికరణం ప్రకారం మాతృభాషను ప్రోత్సహించాలని, తాను అదే విషయాన్ని లోక్ సభ లో ప్రస్తావించానని తెలిపారు.

టిడిపి లోక్ సభ సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ… ఏపీలో మాతృభాష పట్ల వివక్ష కొనసాగుతోందని పేర్కొనగా, తాను స్పీకర్ అనుమతితో మాట్లాడుతూ… తెలుగు భాషను ప్రోత్సహించడానికి , తెలుగు అకాడమీ ఉన్నదని దానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి చైర్మెన్ గా కొనసాగుతున్నారని చెప్పానని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలుగు అకాడమికి రావల్సిన నిధులను తక్షణమే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషపై చేస్తున్న దాష్టికాన్ని ప్రస్తావించకుండా…కొన్ని రాష్ట్రాలలో మాతృభాషపై వివక్ష కొనసాగుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకు వచ్చానని తెలిపారు. రాజ్యాంగంలోని 350 ఏ అధికరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని, హెచ్ ఆర్ డి ఎ మంత్రిని కోరగా , ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. లోక్ సభ లో తాను మాట్లాడిన మాటలు రికార్డు లలో ఉంటాయని , ఇక తాను రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఎలా అవుతుందని రఘురామకృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు.

బొచ్చు లో నాయకత్వం అన్నానని, బిజెపిలో ఎవరైనా ప్రధాని మోడీని విమర్శిస్తే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించడం పై రఘురామ తనదైన శైలిలో స్పందించారు. తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు పోటీ గా, తన బంధువు కుమారున్ని ప్రోత్సహించార ని, అయితే ఒక కార్యక్రమంలో కొత్తగా వచ్చిన నాయకుడు నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు ఇస్తుండడంతో తాను బొచ్చు లో నాయకత్వం అన్నానని, అంతేకానీ జగన్ నాయకత్వాన్ని బొచ్చు లో నాయకత్వం అనలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ పార్టీ నా నాయకులకు జగన్ నాయకత్వం, బొచ్చు లో నాయకత్వం మాదిరిగా అనిపించి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బొచ్చు ఎవరు పీకలేరని అన్నారని గుర్తు చేశారు. అయితే తాను జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బొచ్చులో నాయకత్వం అన్నట్లుగా వీడియో ఎడిట్ చేసి అందజేశారని, కానీ తాను ఆ సందర్భం లో ఏమి మాట్లాడనో, ఆ వీడియో కూడా ఉన్నదన్నారు. తనని పిలిచినప్పుడు తన వాదనలు కూడా వినిపించి, వాస్తవం వీడియోను కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు. ముఖ్యమంత్రి , పార్టీ అధ్యక్షుడు ఒక్కరేనని, అయితే పార్టీ అధ్యక్షుడినీ విమర్శిస్తున్న ట్లుగా ఫిర్యాదు చేశారని రఘురామ తెలిపారు.

పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు తాము అధికారంలోకి వచ్చామని, అయితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. పార్టీ అధ్యక్షుని హోదాలో అధికారంలోకి రాగానే మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి గా మరో 20 ఏళ్ళ వరకు మద్యనిషేధం అమలు అన్న ప్రస్తావనే లేకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి 8 వేల కోట్ల రూపాయలను దారి మళ్లించి బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా 20 ఏళ్లలో వచ్చే ఆదాయానికి గాను 40 వేల కోట్ల రూపాయల అప్పు చేయాలని చూస్తున్నారని తెలిపారు.

దీనితో రేపు వేరే ప్రభుత్వం ఏర్పడిన మద్యనిషేధం అమలుకు బ్యాంకర్ల నుండి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇకపోతే అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లోనే సి పి ఎస్ రద్దు చేస్తామని చెప్పి న జగన్మోహన్ రెడ్డి, సి .పి . ఎస్ రద్దు ప్రస్తావనే తీసుకు రావడం లేదన్నారు. పీ ఆర్ సి ని సైతం పెంచుతామని ఉద్యోగులకు నమ్మబలికి, గత ప్రభుత్వాల కంటే తక్కువ పీఆర్సీని ఇచ్చారని విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వం పై బాదుడే బాదుడు అంటూ విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

పెట్రోల్, విద్యుత్ చార్జీల పెంపు పై గతంలో అసెంబ్లీలో, బయటగొంతు చించుకున్న ఆయన , విద్యుత్ ఛార్జీలను వంద శాతానికి పైగా పెంచారన్నారు. ఇంకా కొన్ని శ్లాబుల వారికి 300 శాతం విద్యుత్ చార్జీలు పెరిగిందన్నారు . బస్సు చార్జీలు కొంచెం పెంచినట్టు గా సాక్షి దినపత్రికలో రాసుకున్నప్పటికీ, 40 శాతం చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు. పోలీసుల దాష్టీకానికి భయపడి ప్రజలెవరూ మాట్లాడకపోయినా, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తనలాంటి వారు మాట్లాడితే తప్పు పట్టడం ఏమిటి ఆయన మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తనకుందని… ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా తననే విమర్శిస్తున్నానని ఆయన భావిస్తే.. పార్టీ విధివిధానాలను ఉల్లంఘిస్తున్నాన ని అనుకుంటే, తనని పార్టీ నుంచి బహిష్కరించ వచ్చునని అన్నారు. తాను మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన హామీలను, ముఖ్యమంత్రి అమలు చేయడం లేదని మాత్రమే ప్రజలకు వివరిస్తున్నానని పేర్కొన్నారు.

అనంత బాబుకు ప్రాణహాని
ఏజెన్సీ ప్రాంతంలో అనంత బాబు తన ఆగడాలతో, వీరప్పన్ ఇమేజ్ సంపాదించుకున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రంగురాళ్లు, గంజాయి తరలింపు వ్యవహారాలు అనంత బాబు పాత్ర ఉన్నట్లు ప్రముఖ దిన పత్రికలలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అయితే, రంగురాళ్లు, గంజాయి కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల ద్వారా అనంత బాబు కు ప్రాణహాని ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయన్నారు. అనంత బాబు ఆగడాలపై ఎన్ ఐ ఏ చేత సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ప్రజల సొమ్ముతో జగన్ విహారయాత్ర
దావోస్ పర్యటన కని సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందిన జగన్మోహన్ రెడ్డి లండన్ కు ఎందుకు వెళ్లారన్న దానిపై రఘురామ స్పందిస్తూ… లండన్ కు వెళ్లి తన పిల్లలను చూసుకుం టా నంటే సీబీఐ కోర్టు అనుమతి నీ ఇవ్వదా? అంటూ ప్రశ్నించారు. గత మూడేళ్లుగా సిబిఐ కోర్టుకు జగన్ మోహన్ రెడ్డి హాజరు కాకపోతే సి.బి.ఐ, సిబిఐ కోర్టు ఏమి చేయగలుగుతున్నాయ ని ప్రశ్నించారు. దావోస్ లో పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్లిన జగన్ బృందం, గౌతమ్ అదానీ కంపెనీతో ఎంఓయూ చేసుకున్నదని, ఇద్దరూ ఇక్కడి వారే నని, అక్కడకు వెళ్లి ఏం ఓ యూ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అమర్ రాజా బ్యాటరీ యాజమాన్యం పెద్ద ఎత్తున నిధులతో విస్తరణ చేపడుతుంటే, ఆ కంపెనీ పెట్టుబడులను ఆకర్షించడంలో లో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కు వెళితే విమర్శించిన వారే.. ఇప్పుడు దావోస్ పర్యటన వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు

LEAVE A RESPONSE