Suryaa.co.in

Telangana

ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? హవ్వ!

– పుష్ప సినిమాపై మంత్రి సీతక్క ఆక్షేపణ

హైదరాబాద్ : ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మంత్రి సీతక్క తీవ్ర మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి విమర్శలు చేశారు.కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది ముఖ్యమన్నారు. సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు ఈ సమాజాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలన్నారు.

‘‘ మానవ హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు, స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడు? సినిమాలో స్మగ్లర్ హీరో. కానీ స్మగ్లింగ్‌ను కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడు? ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి.. రెండు మర్డర్లు చేసిన వ్యక్తిని పుష్ప-2 థియేటర్ లో పట్టుకున్నారు. సందేశాత్మక చిత్రాలు తీస్తేనే ప్రజలు ఆదరించాలి.. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సి ఉంది. సినిమాలను మేం గౌరవిస్తామని, సినిమాలు ఓ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే’’ అన్నారు.

LEAVE A RESPONSE