హైదరాబాద్‌లో మే 20న ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో…

ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు.

ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్‌ సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎడిటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ ఆవిష్కరించబడతాయి.

కాగా, ఈ వేడుకలలో ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ఆనర్‌’గా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ , సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా , సీపీఎం జాతీయ సెక్రటరీ సీతారామ్‌ ఏచూరి , బీజేపీ జాతీయ నేత పురందీశ్వరి , జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ , కన్నడ చిత్ర హీరో శివకుమార్‌ , ప్రముఖ తెలుగు హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌ , ప్రభాస్‌ , దగ్గుబాటి వెంకటేష్‌ , సుమన్‌ గారు, మురళీమోహన్‌ , నందమూరి కళ్యాణ్‌రామ్‌ , ప్రముఖ హీరోయిన్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు జయప్రద , ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు , ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు , సి. అశ్వనీదత్‌ మరియు ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో సావనీర్‌, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటీ పురస్కారాలు అందిస్తుంది.

Leave a Reply