Suryaa.co.in

Telangana

అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

-తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సీఎంలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను, నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలతోపాటు, ఏడాదిపాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు.

LEAVE A RESPONSE