Suryaa.co.in

Telangana

తెలంగాణలో మళ్లీ పాసుబుక్కుల క్యూలు

(అన్వేష్)

హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు మళ్లీ అప్పటి విత్తనాల అవస్థలు షురువయ్యాయా? ఈ చిత్రం ఇచ్చే సమాధానం అదే! ఆందోల్ మండలం జోగిపేటలో జనుము, జీలుగ రాయితీ విత్తనాల కోసం రైతన్నలు మండుటెండల్లో నిల్చున్నారు. అయితే ఎండవేడికి తాళలేక.. వారు తమ పాసుబుక్కులను క్యూలైన్లలో ఉంచిన వైనం, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో తెలంగాణలో విత్తనాల కోసం సరిగ్గా ఇలాంటి విషాద దృశ్యాలే దర్శనమిచ్చేవి. మళ్లీ ఇప్పుడు అలాంటి విచారకర దృశ్యాలు కనిపించడం రైతాంగం దుస్థితికి నిలువెత్తు నిదర్శనంలా మారింది. అప్పట్లో ఈ దుస్థితిని ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు అధికారంలో ఉండటం విశేషం!

LEAVE A RESPONSE