Suryaa.co.in

Telangana

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హైకోర్టులో పిటిషన్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సర్వే నంబర్ 38/8, 38/9లో గల భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చెయ్యాలంటూ బాధిత కుటుంబాన్ని బెదిరించారని ఎమ్మెల్యే గాంధీపై సులోచన అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. అర్ధరాత్రి గాంధీ మనుషులు ఫ్యాక్టరీలో దోపిడీ చేసినా పోలీస్ అధికారులు స్పందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇరవై కోట్ల రూపాయల మెషిన్లను అల్యూమినియం బండెల్‌లను పోలీసుల సాయంతో గాంధీ దోపిడీ చేసారని పిటిషన్‌లో తెలిపారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, ఎస్‌ఐ మల్లేశ్వర్‌లపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలంటూ పిటిషనర్‌కు సూచిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE