Suryaa.co.in

Andhra Pradesh Padayatra News

రైతులపై విరిగిన లాఠీ

మహాపాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి రైతులపై ప్రకాశం జిల్లా పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా పలువురు తీవ్రంగా గాయపడగా, చాలామందికి ఎముకలు విరిగాయి. వారిని స్థానికులు


సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పాదయాత్ర స్థలం భీకరంగా కనిపిస్తోంది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు స్వాగతం పలికేందుకు వచ్చిన స్థానికులను పోలీసులు

అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని మరీ స్థానికులు ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి తమరెవరంటూ

పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి మరీ రైతులకు స్థానికులు సంఘీభావం తెలిపారు. చదలవాడ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

LEAVE A RESPONSE