– ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు
గన్నవరం: నేడు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.
శుక్రవారం మధ్యాహ్నం 02:50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖ, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని), బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కొణిదల నాగబాబు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి, కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, ఉత్తర విశాఖపట్నం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంత రాము, పోలీసు జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిజి అంజనీ కుమార్, ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ అభిషేక్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.