Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పాలనలో స్త్రీలకు రక్షణ

-మనకు పదవులు శాశ్వతం కాదు
-పైపాళ్యం గ్రామ దత్తత, మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి

పైపాళ్యం బూత్ ఇన్చార్జి కార్తిక్
పైపాళ్యం గ్రామంలో బూత్ ఇన్చార్జిగా 2024 ఎన్నికల్లో వ్యవహరించాను. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు విద్యను అందిస్తున్న భువనమ్మ సేవలు కొనియాడదగినవి.ప్రభుత్వంతో పని లేదు అనే విధంగా ఎన్టీఆర్ ట్రస్టు నుండి గత పాలనలో కూడా పేదవారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉన్నారు.

కోవిడ్ సమయంలో కుప్పంలో 5రోజుల్లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసిన ఘనత భువనమ్మది.మా గ్రామాన్ని భువనమ్మ దత్తత తీసుకోవడం మా అదృష్టం. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించడానికి నాతో కలిసి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

ఈ గొప్ప విజయాన్ని చంద్రబాబుకు కానుకగా అందించాం.1720 ఓట్లు టీడీపీకి, 520 ఓట్లు వైసీపీకి 2024 ఎన్నికల్లో మా బూత్ లో వచ్చాయి.మా గ్రామంలో పాఠశాలలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, రోడ్లు వంటి అనేక మౌలిక సదుపాయాలు చంద్రబాబు ఇచ్చారు. రానున్న కాలంలో టీడీపీకి మరిన్న ఓట్లు పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను..

ఎమ్మెల్సీ, కంచర్ల శ్రీకాంత్
తిరుపతి గంగమ్మ జాతరను తలపించేలా పైపాళ్యం ప్రజలు భువనమ్మకు స్వాగతం పలికారు.మన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఎన్నికల ప్రచారం సమయంలో భువనమ్మ మనకు చెప్పారు..అన్న ఎన్టీఆర్ కూతురిగా మాట తప్పకుండా నేడు మన ముందుకు వచ్చి మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు..మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.

నారా భువనేశ్వరి
పైపాళ్యం గ్రామ ప్రజలకు, తెలుగు మహిళలకు, నా ఆడబిడ్డలకు హృదయపూర్వక నమస్కారాలు. వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు.వైసీపీ పాలనలో ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు..

రాష్ట్రంలో నేడు కొలువుదీరిన కూటమి పాలనలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు..మీకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉంది.రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి, ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు.

చంద్రబాబు నాయకత్వం గురించి మీరందరికీ తెలుసు.వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా పేదల పొట్ట కొట్టింది.చంద్రబాబు ప్రజలకు ముఖ్యమైనవన్నీ అందిస్తారు…ఆగష్టు 15న పేదవారికోసం అన్నాక్యాంటీన్లను తెస్తారు.2.70లక్షల మంది రోజుకు, సంవత్సర కాలంలో 7.5కోట్ల మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేశారు.

చంద్రబాబు గత పాలనలో అమలు చేసిన పథకాలను మళ్లీ అమలు చేస్తారు.వైసీపీ నాయకులు నోటికొచ్చిన హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేశారు…ప్రశ్నిస్తే దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు.కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమేమి ఇస్తామని చెప్పారో అవన్నీ ఇస్తారు.

కుప్పం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తెచ్చిన పైపాళ్యం ప్రజలందరికీ నా నమస్కారాలు.మీ గ్రామాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తాను.ప్రాణాలను అడ్డుపెట్టి కుప్పంలో చంద్రబాబును గెలిపిస్తున్న ఘనత మన పార్టీ కార్యకర్తలది…ఇతర ఏ పార్టీకి ఇంత పటిష్టమైన కార్యకర్తలు లేరు.

పార్టీ కార్యకర్తలు, మహిళలను చూస్తే నాకు బంగారుపాళ్యంలోని హంసవేణి గుర్తుకొస్తుంది. నేను నిజం గెలవాలి కార్యక్రమానికి వెళ్లినప్పుడు హంసవేణిని పరామర్శించాను. కేవలం కుళాయిలో మంచినీరు రావడం లేదు, రిపేరు చేయించాలని వైసీపీ నేతలను అడిగినందుకు తన రెండు కళ్లను వైసీపీ దుర్మార్గులు పీకేశారు. ఇలాంటివి మరెన్నో దుర్మార్గపు పనులకు పాల్పడ్డారు. చంద్రబాబు పాలనలో స్త్రీలకు రక్షణచాలా ఎక్కువగా ఉంటుంది.

ఏపీ విభజన తర్వాత రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 6ఏళ్ల బాలికపై 60ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేస్తే ఆ నిందితుడు చంద్రబాబు తీసుకునే చర్యలకు ముందుగానే భయపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సూపర్ సిక్స్ పథకాలను ఏమైతే చంద్రబాబు ప్రకటించారో అవన్నీ అమలు చేస్తారు…వీటితో ఆగకుండా ఇంకెంత చేయగలరో అవన్నీ చేస్తారు.

రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. వైసీపీ చేతకాని పాలనలో మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది…2019లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచి ఉంటే మన రాష్ట్రం ప్రపంచస్థాయిలో నిలబడేది.

నేడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి ప్రపంచ నలుమూలల నుండి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల వారు వస్తున్నారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను. మీరు నాకు పలికిన ఘన స్వాగతం నాకు ఓ పండుగలా అనిపించింది…మీ అందరికీ నా ధన్యవాదాలు…

మనకు పదవులు శాశ్వతం కాదు…ప్రేమాభిమానాలు, ఆప్యాయత ముఖ్యం. కార్యకర్తల సంక్షేమమే మన ధ్యేయంగా పార్టీ నేతలు ముందుకు సాగాలని కోరుతున్నాను.

రాజధానికి విజయ్ కుమార్ చెక్కు బహుకరణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పైపాళ్యం గ్రామస్తులు విజయ్ కుమార్, మరియు తదితరులు రూ.50వేల చెక్కును నారా భువనేశ్వరికి అందించారు. రాజధాని నిర్మాణంలో తాను కూడా భాగం కావాలనే ఉద్దేశంతో ఈ చెక్కును అందించినట్లు దాతలు ప్రకటించారు.

LEAVE A RESPONSE