తెలంగాణపై పంజాబ్ ఎన్నికల ప్రభావం ఉండదు: భట్టి

పంజాబ్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపైన చూపబోవని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పైన భట్టి విక్రమార్క సీఎల్పీ కార్యాలయంలో కలిసిన విలేకరులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉందని, రోగం ముదిరాక మందు వేసినట్టుందని వ్యాఖ్యానించారు. అయినా రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భట్టి పేర్కొన్నారు.

అయితే పంజాబ్ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు తేడా ఉందని, పంజాబ్ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తప్ప వివాదాలు లేవని ఉద్ఘాటించారు.

Leave a Reply