అరాచకాలకు ఆలవాలంగా మారిన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా సికింద్రాబాద్ పార్టీ ఆఫీసు నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్ మాట్లాడుతూ ఏపీలో అరాచకం రాజ్యమేలుతున్న నేపథ్యంలో, కేంద్రం మౌనాన్ని వీడి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపాలని కోరారు. అన్ని పార్టీల కార్యాలయాలకు కేంద్ర భద్రత కల్పించాలన్నారు. ఏపీ డీజీపీ చట్టప్రకారం, ఆత్మసాక్షిగా పనిచేయడం మానేశారన్న విషయం, నిన్నటి ఘటన రుజవు చేసిందన్నారు. కేంద్రం స్పందించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించకపోతే, ఆంధ్రాలో మనుషులు బతకడం కష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పి.బాల్ రాజ్ గౌడ్, రాజా చౌదరి, అంబర్పేట incharge బిల్డర్ ప్రవీణ్, పి.రవీంద్ర చారి.వలరపు శ్రీనివాస్, C H విజయశ్రీ, అన్నపూర్ణ, అనంత రెడ్డి, ముంజ వెంకట్ రాజం. మ్ కే.బోస్, జోగెంద సింగ్. చంద్రా, య. ప్రసాద్ బాబాయ్ భాస్కర్,అనిల్ తదితరులు పాల్గొన్నారు
Devotional
శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు
ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…