Suryaa.co.in

National

వాయనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో,  ఆయన ఇవాళ వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు. కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

నామినేషన్ వేసే ముందు వాయనాడ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. “నా చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వాయనాడ్ ప్రజలను కూడా నా కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాను. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను” అని తెలిపారు.

LEAVE A RESPONSE