Suryaa.co.in

Political News

రాజు.. అప్పుడు నర్సాపురం.. ఇప్పుడు అమరావతి!

– జంప్ అయింది జగన్ ఒక్కరే

ఒక నాడు రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అవుతున్న కార్యక్రమానికి స్థానిక ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు ని హాజరు కానివ్వకుండా, ఎన్ని విధాలుగా అడ్డుకోవాలో అన్ని విధాలుగా అడ్డుకున్నారు జగన్ రెడ్డి.

ఆరోజున ప్రోటోకాల్ విభాగం చేత పట్టుబట్టి మరీ తప్పని సరిగా హాజరు కావలసిన స్థానిక ఎంపీ నీ ప్రోటోకాల్ లిస్ట్ నుంచి తప్పించిన ఘనత జగన్ రెడ్డిది.

నేడు అదే ప్రధాని నరేంద్ర మోదీ..
అదే రఘురామ కృష్ణంరాజు ..
కాకుంటే నేడు ఎంపీ బదులు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు.
ధైర్యంగా నిటారుగా నిలబడి నరేంద్ర మోదీ కి స్వాగతం పలికారు.
కానీ తనకి కూడా ఆహ్వానం వున్నా.. ఇటువంటి శుభకార్యంలో పాల్గొని భరించే పెద్ద మనసు లేక.. ఓర్చుకునే శక్తి లేక జగన్ రెడ్డి నిన్నే బెంగళూరు పారిపోయారు.
దీన్నే ఖర్మ రిటర్న్స్ అంటారు.

– అప్పసాని రాజేష్

LEAVE A RESPONSE