రామోజీ, శైలజకు కోర్టులో ఊరట

– వారం రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
– తెలంగాణ హైకోర్టు

మార్గదర్శి చిట్స్‌పై ఏపీలో నమోదైన కేసుల వ్యవహారంలో ఆ సంస్థ యాజమాన్యానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుల్లో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్‌ను విచారించే అంశంలో తెలంగాణ హైకోర్టుకు పరిధి ఉందా? లేదా? తేలాలని ధర్మాసనం పేర్కొంది. వారం రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో వారం రోజుల పాటు రామోజీరావు, శైలజపై చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టుకు అండర్‌ టేకింగ్‌ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అండర్‌ టేకింగ్‌ను నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

Leave a Reply