జగన్ అధికారంలోకి వచ్చీరాగానే రద్దుచేసిన తొలిపథకం రంజాన్ తోఫా

– ఇఫ్తార్ విందుల్లో టోపీలు పెట్టి, ముస్లింలు చల్లగా ఉండాలంటే సరిపోదని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి
– పండుగ వేళ ఇమామ్, మౌజన్ లను పస్తులుంచిన ఘనుడు జగన్.
• చంద్రబాబు ముస్లింలకు రంజాన్ తోఫాతో పాటు, సంక్రాంతి కానుక సరుకుల్ని కూడా అందించాడు.
• రంజాన్ పండుగవేళ మసీదుల మరమ్మతులకు నిధులిచ్చాడు. షాదీఖానాలు నిర్మించాడు. దుకాన్-మకాన్, దుల్హన్, విదేశీవిద్య పథకాలతో ముస్లిం యువతీయువకుల్ని చంద్రబాబు ఆదుకున్నాడు.
• టీడీపీప్రభుత్వం ముస్లింలకు అమలుచేసిన పథకాల్ని రద్దుచేసిన జగన్ ముమ్మాటికీ ముస్లింల ద్రోహే.
• చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవర్గాల్లో ముస్లింలదే అగ్రస్థానం.
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

ముస్లింలకు రంజాన్ పండుగ చాలాముఖ్యమైనదని, తెలుగుదేశంప్రభుత్వం ముస్లింలు అందరూ సంతోషంగా పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫా, మసీదుల్లో ఉండే మౌజన్ లకు రూ.3వేలు, ఇమామ్ లకు రూ.5వేల చొప్పున నెలనెలా గౌరవవేతనం ఇచ్చిందని, జగన్ వచ్చాక పరిస్థితి తలకిందులైందని, ఇమామ్ లకు రూ.10వేలు, మౌజన్ లకు రూ.5వేలు ఇస్తాననిచెప్పి, అప్పుడప్పుడుఇస్తూ, వారిని దారుణంగా మోసగిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“నేను కొన్నిరోజులుగా ఇమామ్, మౌజన్ లతో మాట్లాడాను. వారు మూడునెలలనుంచీ ప్ర భుత్వం నుంచి తమకు ఎలాంటిసాయం అందడంలేదనిచెప్పి వాపోయారు. రంజాన్ నెలలో ఇమామ్, మౌజన్ లను పస్తులుంచిన ఘనత జగన్ కే దక్కింది. ఇది ఏం న్యాయమో జగన్ సమాధానంచెప్పాలి. ఇమామ్, మౌజన్ లు ఎలా చల్లగాఉంటారో, ప్రభుత్వ ఇఫ్తార్ విందులో అందరూ చల్లగాఉండాలన్న జగన్ సమాధానంచెప్పాలి. పండుగ నాడు పరమాన్నం తినాల్సిన మత పెద్దలు పస్తులుండటానికి జగన్మోహన్ రెడ్డే కారణం.

జగన్ అధికారంలోకి వచ్చాక రద్దుచేసిన తొలిపథకం రంజాన్ తోఫానే
ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్, వారిని ఉద్ధరిస్తున్నట్టు గొప్పలుచెప్పుకుంటు న్నాడు తప్ప, వారికి చేసిందేమీలేదు. కనీసం ఇమామ్, మౌజన్ లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా వారికి ఇవ్వకపోవడం దారుణం. జగన్ నిర్వాకంతో 10వేలమంది ఇమామ్, మౌజన్ లు దీనావస్థలో ఉన్నారు. చంద్రబాబుగారు 6రకాల వస్తువులతో ప్రతి పేద ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చీరాగానే తొలి వేటు రంజాన్ తోఫాపైనే వేశాడు. తానురద్దుచేసిన మొదటిపథకం రంజాన్ తోఫానే.

రంజాన్ పండుగ సమయంలో ఇచ్చేతోఫాతో పాటు, ముస్లింలకు చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక సరుకుల్నికూడా అందించాడు. రంజాన్ సమయంలో మసీదులకు సున్నాలు వేయిం చుకోవడానికి చంద్రబాబుగారు ప్రతిజిల్లాకు నిధులు కేటాయించారు. ప్రతి మసీదుకు కనీసం గా రూ.6వేలవరకు వచ్చేది. జగన్ వచ్చాక మసీదుల మరమ్మతులు ఎక్కడా మచ్చుకైనా జరిగిందిలేదు. ఇఫ్తార్ విందుల్లో టోపీలు పెట్టుకోవడమేగానీ జగన్, ఒక్క మసీదుకి రూపా యి ఇచ్చిందిలేదు.. ఒక్కముస్లింకు పైసా సాయంచేసిందిలేదు. టీడీపీప్రభుత్వంలో 1365 మసీదులకు, 316 దర్గాలకు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనామందిరాలు, 43 ఖబరిస్తా న్ లకు, 1540 అఘార్కానాలకు మరమ్మతులు జరిగాయని ప్రభుత్వరికార్డులే చెబుతున్నాయి.

ఇతరభవనాలకు కూడా చంద్రబాబు మరమ్మతులకోసం నిధులిచ్చారు. మరమ్మ తులకోసమే ఒక్కోజిల్లాకు రూ.2.50కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుది. వాటితో పాటు మండలానికొక షాదీఖానా నిర్మించారు. పేదముస్లింల కోసం చంద్రబాబు దుకాన్-మకాన్ పథకం తీసుకొచ్చి, లక్షలాదిమంది ముస్లింలకు ఆర్థిక సాయంచేశారు. విదేశీవిద్యపథకంతో వందలా ది మంది ముస్లింయువకుల్ని చంద్రబాబు విదేశాలకు పంపారు. విదేశీవిద్యసహా, దుకాన్-మకాన్, దుల్హన్ వంటి గొప్పపథకాల్ని కూడా జగన్ రద్దుచేశాడు.

చంద్రబాబు ముస్లింలకు చేసినసాయం, మేలు ఆకాశంలోఉంటే, జగన్ చేసింది గాల్లో కూడా కనిపించడం లేదు. సొంతంగా వ్యాపారంచేసుకునేముస్లింలకు జగన్ చిల్లిగవ్వ ఇచ్చిందిలేదు. చంద్రబాబు ఇళ్లుకట్టుకోవడానికి ముస్లింలకు డబ్బులిస్తే, జగన్ నివాసయోగ్యం కానిప్రాంతాల్లో పనికిరాని సెంటుపట్టాలిచ్చి వారిని మోసగించాడు. నవరత్నాలంటూ అన్నివర్గాల పథకాలకు కోత పెట్టి, వారిని పన్నులరూపంలో దండుకుంటూ వేధిస్తున్నాడు. వక్ఫ్ ఆస్తుల్ని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే కైంకర్యంచేస్తుంటే, జగన్ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. ఎక్కడా తనపార్టీ వారినుంచి వక్ఫ్ ఆస్తుల్ని తిరిగి రాబట్టింది లేదు. వక్ఫ్ బోర్డ్ లో అనర్హుల్ని పెట్టి, తనఆటలు సాగిస్తున్నాడు.

ముస్లింల సంక్షేమాన్ని, వారికి చంద్రబాబు అందించిన పథకాల్ని అటకెక్కించిన జగన్ ఏ ముఖం పెట్టుకొని ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పాడు?
జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో షాదీఖానాలకోసం కేవలం రూ.10కోట్లు కేటాయించి, తరువాత చేతులు దులుపుకున్నాడు. వైసీపీప్రభుత్వం వచ్చాక ఎక్కువగా దెబ్బతిన్నది ముస్లింలే. చేతివృత్తులు, చిన్నిచిన్నపనులు చేసుకునే ముస్లిం కుటుంబాలు ఉపాధికోల్పోయి పస్తులున్నాకూడా జగన్ ప్రభుత్వానికి పట్టడంలేదు. ముస్లింల సంక్షేమాన్ని, వారి బాగో గుల్ని అటకెక్కించిన జగన్ వారికి ఏముఖం పెట్టుకొని రంజాన్ శుభాకాంక్షలు చెబుతున్నా డు? జగన్ ను ముస్లింలు ఏరకంగా నమ్మాలి..నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నా.

చంద్రబాబు, లోకేశ్ సభలు, సమావేశాలకు ముస్లింలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు అంటే దానికి కారణం టీడీపీప్రభుత్వం వారికి చేసిన మంచి,మేలే. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల ని కోరుకుంటున్నవారిలో ముస్లింలే అగ్రభాగంలో ఉన్నారు. తిరిగి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రతిష్టిస్తేనే ముస్లింలకు, మరీ ముఖ్యంగా ముస్లింయువతీ, యువకులకు మంచి రోజులు వస్తాయి.” అని రఫీ స్పష్టంచేశారు.

Leave a Reply