పునర్నిర్మించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం `కేశవ్ కుంజ్’ ఈ నెలలోనే శివాజీ జయంతి రోజైన 19న గృహప్రవేశంకు సిద్ధంగా ఉంది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేశవ్ కుంజ్ కాంప్లెక్స్ను సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నిర్వహిస్తారు. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే నేతృత్వంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి.
4 ఎకరాల స్థలంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎత్తైన కాంప్లెక్స్లో మూడు ఎత్తైన భవనాలు, నివాస గృహాలు, 8,500 పుస్తకాలతో కూడిన లైబ్రరీ, ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి.
ఢిల్లీలోని ఝాన్దేన్వాలా సమీపంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంకు తొలుత 1939లో పునాది వేసారు. మొదటి అంతస్తు నిర్మాణం 1969లో జరగగా, ఆ తర్వాత 1980లో రెండవ అంతస్తు నిర్మించారు. ఇప్పుడు,
50 సంవత్సరాల తర్వాత, సంస్థ ఈ అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవన నిర్మాణం చేపట్టింది. కొత్త కార్యాలయ భవనంకు 2016 ఆగస్టులో, డా. భగవత్ కేశవ్ పునాది రాయి వేశారు. సాధన, ప్రేరణ, అర్చన అనే మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి.
అత్యాధునిక నిర్మాణాన్ని రూపొందించడానికి గుజరాత్కు చెందిన ఆర్కిటెక్ట్ అనుప్ దూబేను ఎంపిక చేశారు. ఈ భవనం గుజరాత్, రాజస్థానీ, సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది.
సంఘ సాధారణ జీవన విధానం, సాంస్కృతిక వారసత్వ తత్వం, పర్యావణ సానుకూలతలు ప్రతీకగా, భద్రత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించారు. ఈ భవన నిర్మాణంకోసం సుమారు 75 వేలమంది స్వయంసేవకులు రూ 150 కోట్ల మేరకు విరాళాలుగా సమకూర్చారు. ఈ కార్యాలయంలో 300 గదులు, మూడు పెద్ద ఆడిటోరియంలు ఉన్నాయి.
అశోక్ సింఘాల్ ఆడిటోరియం 463 సీట్లలో, రెండవ హాల్ 650 మందికి, మూడవ హాల్ 250 మందికు వీలుగా ఏర్పాట్లు చేశారు. 270 వాహనాలకు పార్కింగ్ స్థలం సమకూర్చారు. మీడియా సమావేశాల కోసం ఎల్ ఈ డి స్క్రీన్లతో కూడిన ఆధునిక ప్రెస్ కాన్ఫరెన్స్ గది కూడా ఈ సౌకర్యంలో ఉంది.
కేశవ్ కుంజ్ భవన నిర్మాణంలో మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి. ప్రతి టవర్ లో 12 అంతస్తులు ఉన్నాయి.
1. సాధన టవర్: పరిపాలనా కార్యాలయాలతో ప్రాంత కార్యాలయంగా పనిచేస్తుంది. పదవ అంతస్తులో 8,500 పుస్తకాలతో కూడిన డిజిటల్ ఆర్కైవ్లతో కూడిన గ్రంధాలయం ఉంది. ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. భారత్ ప్రకాశన్, సురుచి ప్రకాశన్, పాంచజన్య, ఆర్గనైజర్ వంటి సంఘ్ ప్రచురణల కార్యాలయాలు ఉన్నాయి.
2. ప్రేరణ టవర్: పర్యటనలు జరిగే ముఖ్యమైన కార్యకర్తల కోసం నివాసాన్ని ఏర్పాటు చేశారు. వారికి వసతి, కార్యస్థలాన్ని అందిస్తుంది. తొమ్మిదవ అంతస్తులో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హాల్ ఉంది. సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెల్ లతో సహా ప్రముఖులంతా దేశ రాజధానిని సందర్శించినప్పుడల్లా ఈ భవనంలో బస చేస్తారు.
3. అర్చన టవర్: ఇతర నగరాల నుండి సహాయక సిబ్బంది,సందర్శకుల కోసం కేటాయించారు. వారి బస కోసం 80 గదులు ఉన్నాయి. క్రింది అంతస్థులో ఒక క్లినిక్, నివాసితులు, సందర్శకులకు సేవ చేయడానికి ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి. భోజనాలయంలో ఒకేసారి 80 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
అటవీ నిర్మూలనను తగ్గించడానికి కలపకు బదులుగా గ్రానైట్ కిటికీ, తలుపు ఫ్రేమ్లను ఉపయోగించారు. ముఖ్యమైన మురుగునీటి శుద్ధి వ్యవస్థ (ఎస్ టి పి) వ్యర్థాలను అంతర్గతంగా శుద్ధి చేస్తుంది. బాహ్య ఉత్సర్గాన్ని నివారిస్తుంది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి 140 కె డబ్ల్యు సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. భద్రత దృష్ట్యా మొత్తం భవన సముదాయం సీవీటివి పర్యవేక్షణలో ఉంటుంది. సిఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు.
(నిజంటుడే సౌజన్యంతో)