Suryaa.co.in

Andhra Pradesh Entertainment Telangana

తెలుగు రాష్ర్టాల్లో షూటింగులకు అడ్డుచెబుతున్న రోజా భర్త సెల్వమణి

– షూటింగులన్నీ తమిళనాడులోనే చేయాలని ఫిపా లో తీర్మానం
– రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం
– తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ
– హైదరాబాద్లో తమిళ సినిమా షూటింగ్లపై వివాదం

హైదరాబాదులో తమిళ సినిమా షూటింగ్ ల ఫై వివాదం నెలకొంది. ఇకపై షూటింగులన్నీ తమిళనాడులోనే చేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా (ఫిపా)లో తీర్మానం చేశారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే తమ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని అసోసియేషన్ తేల్చి చెప్పింది. అంతే కాకుండా షూటింగ్ల కోసం తమిళ సినీ కార్మికులనే తీసుకోవాలని ఫెప్సీ నిర్ణయించింది.

కాగా, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారు. ఏపీ,తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఉద్యమం లేవదీశారు. తమిళ సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని, అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని సెల్వా అంటున్నారు. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు.

కొంతకాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరుగుతున్నాయి. ఇది ఫేప్సీ పేరుతో ఓసినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?.. అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఏపీలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా ఉన్నారు. నిజానికి దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణికి షూటింగులో లొకేషన్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసు. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు. కానీ లేనిపోని వివాదం రేపి, తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ చేస్తున్నారని కొంతమంది మండిపడుతున్నారు.

LEAVE A RESPONSE