Suryaa.co.in

Telangana

క్రీడలు విద్యార్థులలో వికాసాన్ని పెంపొందింప చేస్తాయి

– పారా స్పోర్ట్స్ క్రీడాకారుల అభివృద్ధి- ఆవశ్యకతను వివరించిన గవర్నర్ తమిళ సై
– జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డిలో పేరా స్పోర్ట్స్

జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డిలో జరుగుతున్న పేరా స్పోర్ట్స్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై విచ్చేశారు. పారాస్పోర్ట్స్ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడాకారులు తమకు అవకాశం, శ్రద్ధ ఉన్న క్రీడల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించి ఎన్నో పతకాలను సంపాదించాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలు విద్యార్థులలో వికాసాన్ని పెంపొందింప చేస్తాయని తెలియజేశారు.

ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడికి రాకుండా ఉండలేకపోయినానని విద్యార్థులకు వివరించారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేయూత ను కొనియాడారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా నవోదయ విద్యాలయాల కమిషనర్ వినాయక్ గర్గ్ విద్యార్థులతో ముఖాముఖి లో భాగంగా, పారాస్పోర్ట్స్ క్రీడాకారుల అభిప్రాయాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి లో ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను గురించి క్రీడాకారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ మెంబర్ శిల్పారెడ్డి,నవోదయ విద్యాలయాల ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ , కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE