Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుని మానసికంగా, భౌతికంగా దెబ్బతీయాలన్నదే తాడేపల్లి ప్యాలెస్ కుట్ర

– టీడీపీ అధినేత ఆరోగ్య సమాచారాన్ని ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలి
• చంద్రబాబుకి వైద్యపరీక్షలు చేసిన వెంటనే, వాటికి సంబంధించిన నివేదికలు జైలు అధికారులు ఎందుకు బయటపెట్టలేదు?
• తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల ప్రకారమే చంద్రబాబు ఆరోగ్య సమస్యల్ని జైలు సిబ్బంది తొక్కిపెడుతున్నారు
• చంద్రబాబు ఆరోగ్య సమాచారం కోసం ఆయన కుటుంబం కోర్టుల్ని ఆశ్రయించాలా?
• జగన్మోహన్ రెడ్డి పాకిస్థాన్లో కూడా లేని ఆంక్షలు ఏపీలో అమలుచేస్తున్నాడు
• ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలు భువనేశ్వరిని కలవడం..ఆమె వారితో మాట్లాడటం ఖాయం
• జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి, చంద్రబాబుకి తక్షణమే ఆయన వ్యక్తిగత వైద్యులతో వైద్యసేవలు అందించాలి
• మాజీ ముఖ్యమంత్రికి కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు ప్రభుత్వమే అందించాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు

చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జగన్మో హన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని, 40 రోజులుగా టీడీపీ అధినేతను జైల్లో పెట్టిన ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం, కావాలనే చంద్రబాబు ఆరోగ్య సమాచారం బయటకు తెలియనీయకుండా వైద్యుల్ని, జైలు అధికారుల్ని కట్టడి చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ చంద్రబాబుని మానసికంగా, భౌతికంగా దెబ్బతీయాలన్న కుట్రలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతున్నాయి. చంద్రబాబుకి జైల్లో 14వ తేదీన వైద్యపరీక్షలు నిర్వహించిన వారు, నేటికీ ఆ పరీక్షల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? చర్మసంబంధిత సమస్యతో బాధపడుతున్నవ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే, వాటికి సంబంధించిన రిపోర్టులు బయటపెట్టకపోవడాన్ని కుట్ర అనక ఏమనాలి? సొంత బాబాయ్ ను తన రాజకీ య ప్రయోజనాల కోసం చంపించిన వ్యక్తి, చంద్రబాబులాంటి గొప్ప నాయకుడి విష యంలో కుట్రలు చేయకుండా ఉంటాడా?

ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కుట్రలకు నాంది పలుకుతుంటే, సకల శాఖల మంత్రేమో వాటిని అమలుచేయడంపై దృష్టి పెడుతున్నాడు. వారిద్దరి మాటలు చేతలు చూస్తుంటే, వారు పూర్తిగా తాము ఉన్న స్థానాలు, వాటి తాలూకా బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారని అర్థమవుతోంది. తమ కుట్రలకోసం రాజ్యాంగ వ్యవస్థలనే వినియోగించుకునే స్థాయికి వారు దిగజారారు .

చంద్రబాబు ఆరోగ్యం బాగుంటే, గతంలో వైద్యులు పరీక్షించిన వెంటనే ఆయన ఆరోగ్య సమాచారం ఎందుకు బయటపెట్టలేదు?
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలు బయటపెట్టాలని ఆయన కుటుంబసభ్యులు కోర్టుల్ని ఆశ్రయించారు. వైద్యనివేదకలు బయటపెట్టకుండా కుట్రలు ఎందుకు చేస్తున్నారు? జైలు అధికారులు తాడేపల్లి ఆదేశాలప్రకారమే చెప్పాల్సిన విషయాలు మాత్రమే బయటకు చెబుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుంటే, ఆయన్ని పరీక్షించిన వెంటనే ఆ పరీక్షల ఫలితాలు, వాటికి సంబంధించిన వైద్యనివేదికలు ఎందు కు బయటపెట్టలేదు?

మాజీ ముఖ్యమంత్రి విషయంలోనే ఇలా వ్యవహరిస్తే, ఇక సామాన్యుల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివే దికల్ని బయటపెట్టాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

కోర్టు చెప్పకముందు చంద్రబాబుని పరీక్షించిన వైద్యులు చెప్పిన అంశాలను జైలు అధికారులు ఎందుకు పెడచెవిన పెట్టారు?
న్యాయస్థానం ఆదేశించే వరకు చంద్రబాబుకి జైలు అధికారులు ఎందుకు ఏసీ సౌకర్యం కల్పించలేదు? కోర్టు కలగచేసు కోకముందు చంద్రబాబుని పరీక్షించిన వైద్యులు చెప్పిన అంశాలను జైలు అధికారులు ఎందుకు బేఖాతరు చేశారు? చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువుతగ్గారని చెబుతున్నారు. దానిపై వైద్యులు ఏంచెప్పారు.. జైలు అధికారులు ఆ సమాచారం ఎందుకు దాచారు?

ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. చంద్రబాబు విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూశాకే ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం, ఆయనపై కుట్రలు చేస్తున్నాయని అర్థమైంది. అధికారం చేతిలో ఉందని రాజకీయ కుట్రలకు పాల్పడితే ప్రజలే ఈ ప్రభుత్వానికి తగినవిధంగా బుద్దిచెబుతారు.

చంద్రబాబు దోషికాదని స్వయంగా న్యాయమూర్తే చెబితే, జైళ్లశాఖ డీఐజీ ఆయన అందరిఖైదీల్లాంటి వాడే అని ఎలా అంటాడు?
చంద్రబాబు ఆరోగ్యంపై, జైల్లో ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అవహేళనగా మాట్లాడటాన్ని ఆయన విజ్ఞత కే వదిలేస్తున్నాం. జైళ్ల శాఖ డీఐజీ చంద్రబాబుని తోటీ ఖైదీల్లానే చూస్తామని ఎలా చెబుతారు? స్వయంగా న్యాయమూర్తే చంద్రబాబు దోషికాదని, ఆయన కేవలం రిమాండ్ లో మాత్రమే ఉన్నారంటే, డీఐజీ నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడతాడు?

40 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలు వెంటనే బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో ఆయనకు వైద్యసేవలు అందించాలని, ఆయన్ని తక్షణమే ప్రముఖ కార్పొరేట్ వైద్యశాలకు తరలించి, అక్కడ మెరుగైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.

ముఖ్యమంత్రి ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ప్రజలు భువనేశ్వరిని కలవడం ఖాయం.. ఆమె వారితో మాట్లాడి, వారి బాధలు తెలుసుకోవడం తథ్యం
భువనేశ్వరిని కలవడానికి వెళ్లే వారిపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు పెడుతోంది? ఆమెకు మధ్ధతుగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేకే, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? భువనేశ్వరిని కలవడానికి కొల్లురవీంద్ర సారథ్యంలో బీసీలు బయలుదేరితే, ఆయన్ని అక్రమంగా నిర్బంధిస్తారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కావడం వల్లే ఇలాంటి అర్థంపర్థంలేని ఆంక్షలు రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. జగన్ సభలకు అంగన్ వాడీలను, డ్వాక్రామహిళల్ని, ఇతరుల్ని బలవంతంగా తరలించినా, బీర్లు.. బిర్యానీలు అందించినా వారు ఎవరూ సభ ముగిసేవరకు నిలబడ టం లేదు.

ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభంకాగానే బారికేడ్లు దూకి మరీ పారిపోతు న్నారు. ప్రజలు తనను పట్టించుకోకుండా, చంద్రబాబుని.. ఆయన కుటుంసభ్యుల్ని పట్టించుకోవడాన్ని, వారి గురించి ఆలోచించడాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతు న్నారు. అందుకే టీడీపీనేతలతో పాటు, భువనేశ్వరికి మద్ధతు తెలపడానికి వెళ్లే ప్రజల్ని కూడా నిర్బంధిస్తున్నారు. ముఖ్యమంత్రి, పోలీస్ శాఖ తీరుచూశాక ఆంధ్రప్ర దేశ్ లో ఉన్నామా..లేక పాకిస్థాన్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.

ముఖ్య మంత్రి ఆంక్షలకు భయపడేవారు ఎవరూ లేరు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజా స్పందన విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే మంచిది. భువనేశ్వరిని కలవడాని కి ప్రజలు వెళ్లడం ఖాయం.. ఆమె వారితో మాట్లాడటం తథ్యం. జగన్ నోరు మంచిదైతే కదా.. ఆయన మంత్రులు, సకల శాఖల మంత్రి నోటిమాట సక్రమంగా ఉండటానికి. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతలు అందరికీ ప్రజలపై ఒక చులకనభావం ఉంది. చంద్రబాబునాయుడి లాంటి నాయకుడిని ఉద్దేశించి సిగ్గులేకుండా మాట్లాడే వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి.” అని కళా వెంకట్రావు హితవుపలికారు.

LEAVE A RESPONSE