సబ్బండ వర్ణాలు పోరాడితే తెలంగాణ వచ్చింది

– రాష్ట్రం వచ్చాక గద్దెనెక్కిన కేసీఆర్ కుల వృత్తులకు తీరని అన్యాయం చేసిండు
– బీసీ కమిషన్ కు కోరల్లేకుండా చేశారు
– బీసీ సంక్షేమానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నాడు
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి

పనులు మానుకొని కుల వృత్తులు, సబ్బండ వర్ణాలు పోరాడితే తెలంగాణ వచ్చింది… రాష్ట్రం వచ్చాక గద్దెనెక్కిన కేసీఆర్ కుల వృత్తులకు తీరని అన్యాయం చేసిండు.ఓబీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన మత రిజర్వేషన్లు అమలు చేశారు… బీసీ కమిషన్ కు కోరల్లేకుండా చేశారు… బీసీ సంక్షేమానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నాడు.తెలంగాణలో అన్యాయమవుతోన్న బీసీలకు న్యాయం చేసేలా ఇవాళ్టి బీసీ డిక్లరేషన్ ఉంది. బిజెపి అధికారంలోకి వచ్చాక జనాభాకు తగ్గట్టే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలకు వాటా ఇస్తాం.వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ కు ఓబీసీలు వచ్చే ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలి… బిజెపిని గెలిపించాలి.

Leave a Reply