కచ్చితమైన మార్పు ఉండబోతోంది:కేసీఆర్

-దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి
-ఎందరో ప్రధానులు వచ్చారు.. దేశ పరిస్థితులు మాత్రం మారలేదు
-రెండు మూడు నెలల్లో సంచలన వార్తను చెపుతాను: కేసీఆర్

KCRబెంగళూరుకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన సంగతి తెలిసిందే. సమావేశానంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని… దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు, మూడు నెలల్లో తాను ఒక సంచలన వార్తను చెపుతానని తెలిపారు. దేవేగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై తాను చర్చించినట్టు చెప్పారు.

మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఎందరో ప్రధానులు వచ్చారని… కానీ దేశ పరిస్థితులు మాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. మన కంటే వెనుకబడి ఉన్న చైనా 16 మిలియన్ల ఎకానమీగా ఎదిగిందని… మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని చెప్పారు. దేశంలో మంచి నాయకులు, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని… అయినప్పటికీ మనం ఇప్పటికీ తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. మన దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోందని, జీడీపీ పడిపోయిందని చెప్పారు. కంపెనీలు మూత పడుతున్నాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు.

Leave a Reply