Suryaa.co.in

Telangana

అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు

– రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఈ దేశంలో స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు దేశ, రాష్ట్ర ఓటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులు రాష్ట్రంలో, దేశంలో రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE