– రాజ్ భవన్ వద్ద మీడియా తో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేసింది. చట్టం కన్నా ముందు ఎంపెరికల్ డేటా ప్రామాణికమైన సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ వేసి కేబినెట్ అప్రూవల్ తీసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపే సందర్భంలో గవర్నర్ న్యాయ పరమైన అంశాలను పరిశీలించి రాష్ట్రపతికి పంపడం జరిగింది.
అందుకు తెలంగాణ బీసీ నాయకులం గవర్నర్ ని కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది. తెలంగాణ లో తీసుకున్న కుల గణన రోల్ మోడల్ దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 2025 జన గణన లో కుల గణన చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.దీనిపై విమర్శిస్తున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి.
గతంలో వ్యతిరేకించిన వారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వం గా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.గవర్నర్ కి ధన్యవాదాలు తెలుపుతున్న.
దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని అమలు చేయడానికి ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం బీసీ ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి..