హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడానికే బ్రాహ్మణ వ్యతిరేక వాదం వెనుక ఉన్న కుట్ర

పరాయి మత చాందస వాద పాలకులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి, బుర్ర ఉంటే చాలు ఎవరికైనా . అపారమైన తెలివితేటలూ అవసరం లేదు . మన దేశాన్ని తుష్కర మూకలు 800 సంవత్సరాలు , క్రైస్తవ మూకలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు . మరి ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే, మన బుర్ర ఎప్పుడైనా ఆలోచించిందా?

మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం బ్రహ్మణేతరులు కాదా ? ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య , శ్రీ కృష్ణ దేవరాయ , ఛత్రపతి శివాజీ , చోళులు , పాండ్యులు వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే . బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు . మన పురాణాల్లో గాని , కధల్లో గాని మనం ఏం చదువుకున్నాం ? ” అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు . ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా…. ” ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది . మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్ష ఎలా చూపించాడంటారు చెప్పండి ?

నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని …నిజానికి అణచివేసింది భూస్వాములు , జమిందారులు , క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే . మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు . ఒకసారి ఆలోచించండి . మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు 2 ,3 ముగ్గురు తప్పించి ఎవరూ లేరు.

మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే, నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు . హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత , పురాణాలు , మహా భారతాలే ఉండేవి కాదు . వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు . ఎప్పటి సంగతో ఎందుకు? హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.

చరిత్రలో బ్రాహ్మణులపై దాడి :
హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను , వారి పిల్లలను నరికి చంపి దూరంగా కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముష్కర చక్రవర్తి ఔరంగజేబు . ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు .

క్రైస్తవ సన్యాసి సెయింట్ జేవియర్, పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు . దాని సారాశం ఏమంటే ” బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు ” అని . అర్ధం అయ్యింది కదా . బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం “Goa Inquisition” పేరుతో చరిత్రలో చదువుకుంటాం .

మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున , 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్ . అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు .
ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ ? మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే, ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు . ముష్కర జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది.

మీకు తెలుసా … కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో , అధిక శాతం బ్రాహ్మణులే . ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే . ఆంధ్ర ప్రదేశ్ లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే . ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు, ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ, అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.

బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల , మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది . వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు .

కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే , దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం . ఇదే వారి సిద్ధాంతం . నేటికి కూడా ఇలా వ్యతిరేక సిద్ధాంత్తాన్ని కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ మొదలైన చాలా పార్టీ వాళ్ళు వెనక ఉండి నడిపిస్తున్నారు . దయచేసి ఎవరు వారి ఉచ్చు లో పడకండి , మీ ధర్మాన్ని చరిత్ర ని తెలుసుకోండి , ధర్మంగా జీవించండి .

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )

Leave a Reply