Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడి ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి:మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్

తమకు కానీస వేతనం ఇవ్వాలని ఇంకా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెలరోజులుగా అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు గా తన పాద యాత్రలో అధికారం కోసం ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే అంగన్వాడిలకు కూడా తెలంగాణా కంటే 1000 రూపాయలు ఎక్కువ కనీస వేతనం ఇస్తానని చెప్పి మోసం చేసి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు. గతంలో టీడీపి ప్రభుత్వ హాయాంలో అంగన్వాడీ లకు గౌరవ వేతనం ఇచ్చి దానిని దశల వారీగా పెంచుకుంటూ 10500చేయడం జరిగిందన్నారు.

ఇప్పుడు జగన్మోహన రెడ్డి 1000రూపాయలు పెంచి 11500చేసి మొత్తం వేతనం తనే పెంచినట్లు గా ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు,రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అంగన్వాడి ల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారుఅంగన్వాడీలు మహిలలైన గానితమ హక్కుల సాధన కోసం అపర కాళికల్లాగ నెల రోజులు గా ఉద్యమం చేయడం అభినందనీయమని అన్నారు . ఈ కార్యక్రమంలో నియోజక వర్గ టీడీపి నాయకులు, సీఐటీయూ నాయకులు అంగన్వాడి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE