-దేవాలయ భూములు అన్యాక్రాంతం పై హైకోర్టు ధర్మాసనం సీరియస్… మధ్యంతర ఉత్తర్వులు వెల్లడి….
అమరావతి:పాత గుంటూరులో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ స్వామి వారి కల్యాణోత్సవం కొరకు యెలవర్తి కుటుంబాచార్యులు గారు 1914 లో 2 ఎకరాల ఆస్తి అయివేజు చేస్తూ వినియోగిచాలని ఈ దేవాలయానికి దఖలు చేశారు. తరువాత ఈ ఆస్తి దానం భూమి గా గుర్తుంపబడి ఎస్. 43 రిజిస్టర్ లో నమోదు అయింది. ఈ ఆస్తిని 2018-21 వరకు లీజు హోల్డ్ రైట్స్ ద్వారా ఎండోమెంట్స్ వారు వేలం వేసి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ భూమి పాత గుంటూరులో ఉన్నందున, కోట్ల రూ/-ల విలువ చేస్తున్నది.
అందువల్ల భూ మాఫియా కన్ను ఈ భూమిపై పడిందని,ఆ దేవాలయ మాన్యాలు కమిషనర్ వారిని మభ్యపెట్టి, ఈ ఆస్తి, మాన్యాలు దేవాలయానికి సంబంధం లేదని 43 రిజిస్టర్ నుండి డీ లిస్ట్ చేయుటకు కమిషనర్ వారి వద్ద నుండి ఉత్తర్వులు పొందియున్నారు. ఈ ఆస్తిని అన్యులకు విక్రయించుటకు, అక్రమ లాభం పొందుటకు ప్రయత్నములు జరుగుతున్నవని తెలిసి కొంతమంది స్థానిక భక్తులు జూలూరి హేమాంగద గుప్తా హైకోర్టు న్యాయవాది సి.పి సోమయాజి ని ఆశ్రయించారు.ఆయన ఆధ్వర్యంలో ప్రజా వ్యాజ్యం Wp(pil) no. 70/2022 దాఖలు చేయగా హైకోర్టువారు నేడు ఈ కేసు పూర్వపరాలు పరిశీలించి సదరు ఆస్థి అందు మూడవ పక్షం వారు ఎటువంటి అన్యాక్రాంతములు జరుపకూడదని హైకోర్టు ధర్మాసనం నుండి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు హైకోర్టు జడ్జి యం. సత్యనారాయణ మూర్తి నేడు 27.04.2022 స్టే విధిస్తు మధ్యంతర ఉత్తరవులు వెలువర్చారు.