Suryaa.co.in

Telangana

గిరిజనుల సమస్యల పరిష్కారం కేసీఆర్ తోనే సాధ్యం

– మంత్రి తలసాని

గిరిజనుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం NTR స్టేడియంలో నిర్వహించే గిరిజన, ఆదివాసీ సమ్మేళనం సభకు పీపుల్స్ ప్లాజా నుండి సెక్రెటరియేట్, తెలుగుతల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి NTR స్టేడియం వరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, CS సోమేశ్ కుమార్, MLC సురభి వాణి దేవి, MLA లు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, రసమయి బాలకిషన్, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ తదితరులు ర్యాలీగా చేరుకున్నారు. ర్యాలీలో కళాకారులు గుస్సాడీ, లంబాడీ, ఒగ్గు, బుర్రకథ, కోలాటం, బతుకమ్మ తదితర ప్రదర్శనలు, వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

LEAVE A RESPONSE