Suryaa.co.in

Telangana

తెలంగాణలో అప్పు లేని రైతు లేడు

– 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు
– ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఅర్..ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారు
వ్యవసాయాన్ని పండుగ చేస్తాం
-వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
– నర్సంపేట నియోజక వర్గం నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

9 ఏళ్లుగా కేసీఅర్ చేస్తుంది పచ్చి మోసం.డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని మోసం. అసలు రాష్ర్టంలో సర్కార్ బడులు బంద్ పెట్టే స్థాయిలో ఉన్నాయి.మూడు ఎకరాల భూమి అని మోసం..పోడు పట్టాలు అని మోసం.రుణమాఫీ అని మోసం..

తెలంగాణ లో అప్పు లేని రైతు లేడు. 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయి. ఈ 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక 100 ల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయింది. ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఅర్..ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారు. ప్రజల సమస్యల కోసం కేసీఆర్ బయటకు రాడు. కేవలం ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఓట్లు అయితే మళ్ళీ తిరిగి కూడా చూడడు.

ఈ సారి ఎన్నికలు ఉన్నాయి. కేసీఅర్ మళ్ళీ వస్తాడు.ఆకాశంలో చందమామ అంటాడు.కేసీఆర్ సర్కార్ కూలి పోవాలి.కేసీఅర్ ఫామ్ హౌజ్ కి పరిమితం కావాలి.ప్రజల కష్టాలు చూస్తూ 3500KM పాదయాత్ర చేశ మళ్ళీ వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్తం.వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మహిళ పేరు మీద కట్టిస్త.వైఎస్సార్ ప్రతి పథకానికి జీవం పోస్తాం. మొదటి సంతకం భారీగా ఉద్యోగాల మీద పెడతా. అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి పెన్షన్ లు.

LEAVE A RESPONSE