Suryaa.co.in

Telangana

ఇది ప్రజలను వేధించే పాలన

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ :ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ – బడిపిల్లలకు బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా? అమృత్ స్కీంను అప్పనంగా బామ్మర్ది కి కట్టబెట్టడంలో ఉన్న తెలివి – బుక్కెడు బువ్వకు అలమటిస్తున్న పసిపిల్లల కడుపు నింపడంలో లేదా?

ఆదానికి రాష్ట్రంలోని వనరులు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ద – ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై లేదా? మూసీ ప్రక్షాళన పేరుతో మూటలు కట్టి ఢిల్లీకి కట్టలు పంపడంలో ఉన్న ప్రేమ – భవిష్యత్ భారతావని వారసులైన పసిపిల్లల ఆకలి కేకలపై లేదా?

మంత్రుల సంగతి దేవుడెరుగు, ముఖ్యమంత్రి ఇలాకాలోనే బడి పిల్లల పస్తులు. మీ ఢిల్లీ బాసులు .. మీ గల్లీ దోస్తుల ఆకలి తీర్చడం కాదు రేవంత్ .. ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టు. ఒక్క పూట ఫోటోలకు ఫోజులిచ్చి …గప్పాలు కొట్టడం కాదు – నిత్యం గుప్పెడు అన్నం అందుతుందో లేదో సమీక్ష చేసి చూడు.

LEAVE A RESPONSE