Suryaa.co.in

Features

ఈ ‘శంకరు’డు సామాన్యుడు కాదు.. అమెరికాకే వాతలు పెట్టాడు!

జై శంకర్ .. మన విదేశాంగ శాఖ మంత్రి !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి జై శంకర్. చైనా,రష్యా,అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా తన సమాధానాలతో సంతృప్తిపరచగలడు లేదా అదే సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వగలడు.
రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనవద్దు అంటూ US స్టేట్ ఆఫ్ సెక్రటరీ అయిన అంటోనీ బ్లిన్ కెన్ ని న్యూ డిల్లీ పంపించింది అమెరికా !

ముఖాముఖి చర్చల అనంతరం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికన్ జర్నలిస్ట్ ఒకరు ‘రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించినా మీరు ఎందుకు క్రూడ్ ఆయిల్ కొంటున్నారు’ అని అడిగాడు దానికి జవాబుగా జై శంకర్ .. మేము మా అవసరాల కోసం కొనే క్రూడ్ ఆయిల్, రెండు నెలలకి సరిపోతుంది. కానీ యూరోపు అదే మొత్తం ఆయిల్ ని ఒక పూటలో కొంటున్నది రష్యా నుండి ! విలేఖరితో పాటు అక్కడే ఉన్న బ్లింకెన్ ముఖం మాడిపోయింది.

జై శంకర్ నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించని అమెరికన్ విలేఖరి విస్తుపోయాడు. ఇదివరకు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయి కానీ అమెరికన్ మీడియాకి మన ప్రతినిధులు చాల సౌమ్యంగా సమాధానం ఇచ్చేవారు వినయంగా. ఎందుకంటే అది అమెరికా కదా ? యూరోపు మాత్రం తమ అవసరాలని ఒదులుకోలేదు. కానీ అవతలి వాళ్ళు, వాళ్ళ వాళ్ళ అవసరాలని ఒదిలేసుకోవాలి వీళ్ళని సంతృప్తి పరచడం కోసం !

సాధారణంగా మాట వినని దేశాల మీద అమెరికా ప్రయోగించే మరో అస్త్రం పేరు మానవ హక్కుల ఉల్లంఘన ! ఆ పేరుతో ఏదో విధంగా ఆంక్షలు విధించడం పరిపాటి ! ఈ సారి కూడా అంటోని బ్లిన్కెన్ అదే అస్త్రాన్ని ప్రయోగించాలని చూశాడు. భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. బ్లింకెన్ కి జై శంకర్ బీ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు.మానవ హక్కుల ఉల్లంఘన అనేవి ఏదో కొన్ని దేశాలకి పరిమితం కాదు. అన్ని దేశాలలోనూ జరుగుతున్నాయి కానీ ఆ సంఘటనల వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు. అయితే భారత దేశం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. మానవ హక్కుల మీద భారత్ కి మంచి అవగాహన ఉంది కూడా !

అమెరికాలో కూడా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అది మేము గమనిస్తున్నాము అని జావాబు ఇచ్చాడు జై శంకర్ . జై శంకర్ గారి మాటల వెనక ఉన్న మర్మం ఏమిటో బ్లింకెన్ కి బాగానే అర్ధమయ్యింది. ఎందుకంటే గత 10 రోజుల వ్యవధిలో న్యూయార్క్ నగరం లో వరుసగా ఇద్దరు సిక్కుల మీద దాడులు జరిగాయి. ఇద్దరినీ బాగా కొట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తో పాటు, ఖరీదయిన వాచీలు దోపిడీ చేశారు ! పరోక్షంగా జై శంకర్ ఈ ఘటనలనే బ్లింకెన్ ముందు ప్రస్తావించారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ విదేశాంగ మంత్రి కూడా, ఈ విధంగా దీటుగా మొఖం మీద కొట్టినట్లు సమాధానం ఇవ్వలేదు అమెరికాకి !

నల్లజాతి వాళ్ళ మీద చూపిస్తున్న జాతి వివక్ష వల్లనే కదా.. పోయిన సంవత్సరం అమెరికా అట్టుడికిపోయింది ? వీళ్ళు ఎవరికి సుద్దులు చెప్తున్నారు ?
ఇంతకీ జై శంకర్ గారు ఎవరు ? ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తున్నారు మోదీజీ ?
Dr. జై శంకర్ జపాన్ దేశానికి చెందిన క్యోకో [Kyoko] అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి ధ్రువ మరియు అర్జున్ అనే ఇద్దరు కుమారులు మేధా అనే కుమార్తె ఉన్నది.

Dr. జై శంకర్ గారు K.సుబ్రహ్మణ్యం అనే మాజీ IAS ఆఫీసర్ కుమారుడు. సుబ్రహ్మణ్యం గారు మన దేశ అణు విధానానికి రూపకర్త,సిద్ధాంత కర్త. అణు విద్యుత్ రంగానికి మన దేశం తరపున రాయబారిగా వ్యవహరించిన మేధావి. తన బాచ్ లో టాపర్ కూడా ! Dr. జై శంకర్ గారికి తమిళ, హిందీ,ఇంగ్లీష్,రష్యన్,జపనీస్,చైనీస్ భాషలలో ప్రావీణ్యం ఉంది. హంగేరియన్ భాషలో ప్రవేశం ఉంది.

IFS ఆఫీసర్ అయిన జై శంకర్ మొదటగా 1977 లో సర్వీసులో జాయిన్ అయ్యారు. 1979 నుండి 1981 వరకు అప్పటి సోవియట్ యూనియన్ లో indian మిషన్ to సోవియట్ యూనియన్ లో, మొదట మూడవ సెక్రటరీగా, తరువాత రెండవ సెక్రటరీ గా భారత్ తరపున పనిచేసారు.ఆ కాలంలోనే రష్యన్ భాష నేర్చుకున్నారు జై శంకర్ .

తరువాత న్యూ డిల్లీ వచ్చి, అప్పటి ప్రముఖ దౌతవేత్త అయిన గోపాలస్వామి పార్ధసారధి గారి దగ్గర అండర్ సెక్రటరీగా పని చేశారు అది అమెరికా డివిజన్ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టేర్నల్ అఫైర్స్ [Americas division of India’s Ministry of External Affairs] లో నేరుగా అమెరికా వ్యవహరాహాల మీద అన్నమాట. గోపాలస్వామి పార్ధసారధి టీమ్ లో ఉంటూ , అమెరికా మన దేశంలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రానికి కావాల్సిన అణు ఇంధనాన్ని సప్లై చేయడానికి గాను జరిగిన ఒప్పందం లో పనిచేశారు.1985 to 1988 వరకు అమెరికా లోని వాషింగ్టన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో first సెక్రటరీ గా పనిచేసారు.

2014 లో మోదీజీ అధికారంలోకి వచ్చిన తరువాత జై శంకర్ పని తీరు , అతనికి ఉన్న బహు భాషా పరిజ్ఞానం ని దగ్గర నుండి చూసిన తర్వాత.. ఒక indian ఫారిన్ సర్వీస్ అధికారిని నేరుగా భారత విదేశాంగ మంత్రిగా నియమించారు మోడీ . మోదీజీ నిర్ణయం వృధా కాలేదు. గొప్ప ఫలితాలని ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జై శంకర్ పేరు దౌత్య వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది అంటే, దాని వెనుక జై శంకర్ కి మోదీజీ ఇచ్చిన స్వేచ్చ కూడా ఒక కారణం. అయితే ఇచ్చిన బాధ్యతని తన శక్తిమేరకు నిర్వహిస్తున్న జై శంకర్ నిర్విరామ కృషి కూడా ఉంది.

ఇప్పుడు అర్ధమవుతున్నదా ? పుతిన్ తో నేరుగా రష్యన్ భాషలోనే మాట్లాడగలరు జై శంకర్. అలాగే చైనా విదేశాంగ మంత్రితో మాండరిన్ భాషలో మాట్లాడగలరు. జపాన్ ప్రధాని లేదా జపాన్ విదేశాంగ మంత్రితో నేరుగా జపనీస్ భాషలో మాట్లాడగలరు. సుదీర్ఘకాలం భారత్ తరపున వివిధ దేశాలలో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవం కి తోడు, తన తండ్రి అయిన మాజీ IAS అధికారి సుబ్రహ్మణ్యం శిక్షణ తో పాటు, అప్పట్లో ప్రముఖ దౌత్యవేత్త అయిన గోపాలస్వామి పార్ధసారధి శిష్యరికం.. వెరసి నేటి జై శంకర్ అన్నమాట !

మహా అయితే సీనియర్ డిప్లోమాట్ గా రిటైర్ అయ్యే వారు జై శంకర్. కానీ ఆయన మోదీజీ దృష్టిలో పడడం అనేది ఆయన అదృష్టం తో పాటు మన దేశ అదృష్టం అని కూడా చెప్పవచ్చు !

ఇప్పటి మంత్రివర్గంలో ఇద్దరు ప్రముఖులు.. ఒకరు అజిత్ దోవల్ మాజీ IPS అధికారి అయితే , రెండో వారు జై శంకర్ మాజీ IFS అధికారి. ఇద్దరూ కూడా కేబినెట్ రాంక్ మంత్రులు! ఇద్దరూ తమ తమ రంగాలలో అద్భుత ప్రతిభని చూపిస్తూ, మన దేశ జెండాకి గౌరవం తెస్తున్నారు విదేశాలలో ! దీని వెనుక మోదీజీ కృషి కూడా ఎంతో ఉంది. రాజకీయ నాయకులని నియమించకుండా, ఆ రంగాలలో అనుభవం ఉన్నవారిని మంత్రులుగా ఎంచుకోవడం అనేది సాహసోపేతమయిన చర్య అవుతుంది. ఇలాంటి సాహాస నిర్ణయం తీసుకోవడం ఇతరుల వల్ల కానే కాదు !

 

LEAVE A RESPONSE