Suryaa.co.in

Telangana

విశ్వహిందూ పరిషత్ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్

బజరంగ్దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు సౌత్ జోన్ డిసిపి అదనపు డీసీపీ లపై డిమాండ్ చేయడానికి సవాల్ చేస్తున్నారు. రకరకాల పేర్లతో కాల్స్ ఏసి భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించి తలపెట్టిన నిరసన కార్యక్రమాలు వెంటనే రద్దు చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే వాస్తవంగా విశ్వహిందూ పరిషత్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను మార్పిడి చేసి వైరల్ చేశారు. కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు జోడించి జనాల్లోకి వదిలారు. దీనిపై బాలస్వామి స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE